Don't Miss!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
మహేష్ సినిమా కాబట్టే... అంత రెమ్యునేషన్
హైదరాబాద్ : మహేష్ బాబు, పవన్ వంటి స్టార్స్ సినిమాలు చేయాలని టెక్నీషియన్స్ ఉత్సాహం చూపించటానికి ఉన్న కారణాలలో రెమ్యునేషన్ కూడా ఒకటి. పెద్ద హీరోల సినిమాలకు పనిచేస్తే వచ్చే రెమ్యునేషన్ కూడా ఆ రేంజిలో భారిగానే ఉంటుంది. తాజాగా అలాంటి పెద్ద మొత్తాన్ని రెమ్యునేషన్ గా సినిమాటోగ్రాఫర్ మది తీసుకున్నారని సమాచారం. అక్టోబర్ 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
గతంలో మిర్చి, రన్ రాజా రన్ చిత్రాలకు కెమెరా వర్క్ ఇచ్చి సినిమాకు బాగా ప్లస్ అయిన మది..తన తాజా చిత్రం నిమిత్తం కోటి నలభై లక్షలు తీసుకున్నట్లు సమాచారం. మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ చిత్రానికి ఈ పెద్ద మొత్తం అందిందని ఫిల్మ్ నగర్ టాక్. తెలుగులో సినిమాటోగ్రాఫర్స్ కు ఇది చాలా పెద్ద మొత్తమే అంటున్నారు.
మహేష్బాబు - కొరటాల శివ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటుందని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా బండి ముందుకు కదిలింది. కథ సిద్ధమైందని.. త్వరలోనే సెట్స్పైకి వెళ్తామని చిత్రబృందం ప్రకటించింది.
మహేష్ బాబు మాట్లాడుతూ....కొరటాల చెప్పిన కథ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉంది. మా కాంబినేషన్ లో ఇది మంచి కమర్సియల్ ఫిలిం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఈ సినిమా రూపొందుతోంది అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''నా రెండో చిత్రమే మహేష్బాబుతో చేయబోతుండడం ఆనందంగా ఉంది. క్లాస్, మాస్ కలిపిన కథలో మహేష్ పాత్ర ఆకట్టుకొంటుంది. ఈ కథలో అన్ని రకాల వాణిజ్య హంగులూ ఉన్నాయి. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు దొరికారు.ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. యువతరం, కుటుంబం తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. మహేష్ బాబు అభిమానులు మెచ్చే చిత్రం అవుతుంది ''అన్నారు.
నిర్మాలు మాట్లాడుతూ... మా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చెయ్యడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.
ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్.