twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగులో డేటిచ్చారు... మరి మహేష్ వస్తాడా?

    By Srikanya
    |

    చెన్నై: శంకర్‌ దర్శకత్వంలో విక్రమ్‌ నటించిన 'ఐ' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో క్రితం సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగు వెర్షన్ కు గానూ హైదరాబాద్ లో ఆడియో పంక్షన్ ని జరపటానికి నిర్ణయించారు. అక్టోబర్ 2న ఆడియో విడుదల చేయనున్నారు. తమిళ వెర్షన్ కు గానూ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ గెస్ట్ గా వచ్చారు. మరి తెలుగుకు ఎవరు రానున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబు వస్తాడని కొందరంటున్నారు. కారణం దర్శకుడు శంకర్...మహేష్ ఆగడు చిత్రం ఆడియో పంక్షన్ కి వచ్చారు.

    నటుడు విక్రం ఈ సినిమా కోసం తన శరీరాకృతిని మూడు రకాలుగా మార్చుకున్నారు. ఇందులో విక్రం క్రూరంగా, లవర్‌బాయ్‌ వంటి పలు పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్‌ రవిచంద్రన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'ఆస్కార్‌' విజేత ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఇందులో మొత్తం ఎనిమిది పాటలున్నాయి. ఆడియో విడుదల రోజునే తెలుగు వెర్షన్ ట్రైలర్ ని సైతం విడుదల చేయనున్నారు.

    Mahesh guest to ‘I’ Telugu audio?

    దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం ప్రత్యేకించి పలు హాలీవుడ్‌ కంపెనీలు పనిచేశాయి. ఆ ప్రతినిధులు షూటింగ్‌ చూసి ఇలాంటి సినిమాల్లో నటించడం విక్రమ్‌లాంటి నటుడికే సాధ్యమన్నారు. అంత అంకిత భావంతో విక్రమ్‌ నటించాడు'' అన్నారు.

    విక్రమ్‌ మాట్లాడుతూ ''శంకర్‌ లాంటి దర్శకుడి చిత్రంలో మళ్లీ నటించడం వరంగా భావిస్తున్నా. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మీ ముందు కన్పిస్తున్న 'మృగం' వంటి పాత్ర కోసం కనిష్టంగా మూడు గంటల పాటు మేకప్‌ వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఎంతో ఓర్పుతో మేకప్‌ వేసుకుని కెమెరా ముందుకెళ్లాను. ఇలాంటి సినిమాలో నటించడం ఓ సవాలు లాంటిదే. ఇలాంటి మరో నాలుగు పాత్రల్లో సినిమాలో కన్పిస్తాను. ''అన్నారు.

    English summary
    Shankar’s I makers are planning to release the Telugu audio on October 2nd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X