Don't Miss!
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- News భోజనాలున్నాయమ్మా వెళ్లొద్దు.. విజయసాయికి షాక్; ఇజ్జత్ తీసిన టీడీపీ!!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్,ఎన్టీఆర్ కూడా రోడ్డుపైకి
హైదరాబాద్: అవును, కరెక్టే...మహేష్ బాబు,ఎన్టీఆర్ లు కూడా త్వరలో అఖిల్ నడిచిన దారిలో నడవనున్నారు. ఇంతకీ ఆ దారి ఏమటీ అంటే మంచు లక్ష్మి ఛారిటీ పోగ్రామ్ మేము సైతం కోసం కష్టపడటం.
అఖిల్..ఆటో నడిపి, రానా...ముఠా మేస్త్రిలా మూటలు మోసి ఈ పోగ్రామ్ కి సహకరించారు. సెలబ్రెటీలు అంతా సామాన్యుల్లా కష్టపడి డబ్బు సంపాదించటం ఈ పోగ్రామ్ ఉద్దేశ్యం. ఈ పోగ్రామ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని దాచి,ఏదైనా ప్రకృతి భీబత్సాలు జరిగినప్పుడు ఉపయోగించనున్నారు.
ఆల్రెడీ రకుల్ ప్రీతి సింగ్, రానా, అఖిల్ ఈ పోగ్రామ్ నిమిత్తం మంచు లక్ష్మి కోరిక మేరకు వచ్చి పనిచేసారు. నెక్ట్స్ విడతలో ఎన్టీఆర్, మహేష్ రానున్నారు. ఆ తర్వాత సమంత, అల్లు అర్జున్ ని పిలవనున్నారు. ఇలా సెలబ్రెటీల అందరినీ ఇన్వాల్వ్ చేయనుంది లక్ష్మి.
ఈ పోగ్రామ్ ని టీవిలో టెలీకాస్ట్ చేసి వచ్చేమొత్తం ఈ ఫండ్ కోసం వినియోగిస్తారు. మొన్న చెన్నై వరదలు వచ్చినప్పుడు మేము సైతం అనే పోగ్రామ్ డిజైన్ చేసి మంచు లక్ష్మి,రానా,అఖిల్ వంటివారు కష్టపడ్డారు. అదే స్పూర్తితో కొనసాగిస్తున్నారు.