Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్-శ్రీకాంత్ అడ్డాల కొత్త చిత్రం టైటిల్
హైదరాబాద్ : మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో గతంలో "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" అనే చిత్రం వచ్చి విజయవంతమైంది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని, ఇప్పటికే కథని మహేష్ ఓకే చేసారని తెలుస్తోంది. ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇక ఈ చిత్రానికి "బ్రహ్మోత్సవం" అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాల గ్రామీణ నేపధ్యంలో ఈ చిత్రం జరుగుతుందని, ఓ పెద్ద కుటుంబంలో జరిగే కథ ఇదని చెప్పుకుంటున్నారు.
మహేష్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.సంగీతం దేవీశ్రీ ప్రసాద్ అందించగా మైత్రీ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
అలాగే...శ్రీకాంత్ అడ్డాల..."ముకుందా" కు తుది మెరుగులు దిద్దుతున్నారు. వరుణ్తేజ్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ముకుందా. లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పకుడు.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ... యాక్షన్ అంశాల మేళవింపుతో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రమిది. పల్లెటూరి అనుబంధాలు, ప్రేమలు, రాజకీయాలు యువతరంపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతున్నాయనే అంశాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ఎలాంటి అంశాలకు ప్రభావితం కాని ఓ కుర్రాడి జీవితం ప్రేమ కారణంగా ఎన్ని మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
ఇదివరకు నేను తెరకెక్కించిన చిత్రాలకి భిన్నంగా యాక్షన్కి ప్రాధాన్యమిస్తూ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నా. ప్రతీ సన్నివేశం సహజంగా కనిపించాలని భీమవరం, అమలాపురం, తాడేపల్లిగూడెం, ద్రాక్షారామం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. యువతరం భావోద్వేగాల్ని ప్రతిబింబిస్తూ సాగే ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. వరుణ్తేజ్ నటన, పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''ఒక చిన్న పట్టణం నేపథ్యంలో సాగే కథ ఇది. ముకుంద అనే ఓ యువకుడి ప్రేమపై స్థానిక పరిస్థితులు ఎలాంటి ప్రభావం చూపించాయి? వాటి నుంచి బయట పడేందుకు అతను ఏం చేశాడు? అనే విషయాలు ఆసక్తికరం. వరుణ్తేజ్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.'' అన్నారు.