Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అదేం పాత్ర?... మంచు లక్ష్మికి మోహన్ బాబు చివాట్లు!
హైదరాబాద్: మోహన్ బాబుకు కోపం వస్తే ఎవరినైనా సరే కడిగేస్తాడు. ఇటీవల తన కూతరు మంచు లక్ష్మికి కూడా మోహన్ బాబు ఓ విషయంలో చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకీ లక్ష్మీ చేసిన తప్పేంటంటే 'గుంటూరు టాకీస్'లో గెస్ట్ రోల్లో నటించడమే. గెస్ట్ రోల్ చేయడంలో తప్పు లేదు కానీ... ఆమె ఎంచుకున్న పాత్ర మోహన్ బాబుకు అస్సలు నచ్చలేదు.
గతంలో 'చందమామ కథలు' మూవీ తెరకెక్కించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు 'గుంటూరు టాకీస్' చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో ఓ చిన్న పాత్ర కోసం లక్ష్మిని అడగటంతో కేవలం అతని కోసం గెస్ట్ రోల్ చేసింది. అది కూడా హీరో దగ్గర డబ్బులు కొట్టేసే సీన్లో నటించింది.
అసలు గుంటూరు టాకీస్ సినిమా మోహన్ బాబు అస్సలు నచ్చలేదని సమాచారం. రష్మి అందాలు ఎరవేసి సినిమా ప్రమోషన్ నిర్వహించడంతో ఆయన దీన్ని బి గ్రేడ్ సినిమాగా తేల్చేసారట. అలాంటి సినిమాలో తన కూతురు మంచు లక్ష్మి డబ్బులు కొట్టేసే పాత్ర చేసిందని తెలిసి మోహన్ బాబుకు కోపం కట్టలు తెంచుకుందని అంటున్నారు.
దీంతో మంచు లక్ష్మిని పిలిచి సుతి మెత్తగా చివాట్లు పెట్టినట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారుపై నమ్మకంతోనే గుంటూరు టాకీస్ లో గెస్ట్ రోల్ చేసానని, ఇకపై ఇలాంటి బిగ్రేడ్ సినిమాల్లో నటించని తండ్రికి వివరణ ఇచ్చుకుందట మంచు లక్ష్మి.