twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్: తనపై సినిమా తీస్తున్నందుకు ధోనీ ఎంత చార్జ్ చేస్తున్నాడో తెలుసా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టీమిండియా స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని జీవితంపై త్వరలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 'ఎంఎస్ ధోని-ది అన్ టోల్డ్ స్టోరీ' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈచిత్రంలో కోసం దేశంలోని క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ఒక క్రికెటర్ జీవితంపై సినిమా రావడం... అది అతని రిటైర్మెంటుకు ముందే రిలీజ్ అవ్వడం ఇదే తొలిసారి. ధోని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఎక్కడో జార్ఖండ్ రాష్ట్రలో మామూలు మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఇద్ద పెద్ద క్రికెట్ స్టార్ గా ఎదగడం వెనక చాలా విషయాలు ఉన్నాయి.

    అవన్నీ సినిమాలో చూపించబోతున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లీషులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమా వేలాది థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    కాగా... తన జీవిత కథను సినిమాగా తీసినందుకు ధోనీ రూ. 60 కోట్ల వరకు చార్జ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత భారీ మొత్తంలో ధోనీ చార్జ్ చేయడం చర్చనీయాంశం అయింది. అయితే ఈ మొత్తం ఆయనకు ముందే చెల్లించారా? లేక సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాల నుండి ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

    స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..

    ట్రైలర్ కు అనూహ్య స్పందన

    ట్రైలర్ కు అనూహ్య స్పందన

    ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే అనూహ్య స్పందన వచ్చింది.

    తెలుగులో కూడా

    తెలుగులో కూడా

    సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది. తెలుగులో ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు.

    హీరో, డైరెక్టర్

    హీరో, డైరెక్టర్

    సుషాంత్‌ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను నీరజ్‌ పాండే డైరెక్ట్ చేస్తున్నాడు.

    హీరోయిన్

    హీరోయిన్

    ఈ సినిమాలో ధోనీ భార్య పాత్రలో కైరా అడ్వాణీ నటించారు.

    రిలీజ్ డేట్

    రిలీజ్ డేట్

    సెప్టెంబరు 30న ఈ సినిమా రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది.

    ఆ విషయాలన్నీ

    ఆ విషయాలన్నీ

    ధోని చిన్న తనం నుండి ఆయన దేశం గర్వించదగ్గ క్రికెటర్ గా ఎదిగే వరకు అతని జీవితంలో చోటు చేసుకున్న అన్ని ముఖ్య సంఘటనలు ఈ సినిమాలో చూపించబోతున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై క్రికెట్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

    English summary
    The upcoming biopic on Team India's limited overs skipper Mahendra Singh Dhoni, MS Dhoni: The Untold Story, is being anxiously awaited after the film's trailer was released earlier this month. It will be the first occasion when a film will be released on a cricketer's life before his retirement from the game and it is generating all the right buzz across the nation. Right from the start of the film's shoot, people were wondering how much MS Dhoni demanded from the filmmakers for biopic. As per a report published in Daily Bhaskar, MS Dhoni demanded a sum of Rs. 60 crore from the filmmakers before allowing them to produce a biopic on his life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X