Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘దిక్కులు చూడకు రామయ్య’ కథ ఇదా... షాక్?
హైదరాబాద్ : నాగశౌర్య, సనా మక్బూల్, అజయ్, ఇంద్రజ ముఖ్యపాత్రల్లో త్రికోటి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం ‘దిక్కులు చూడకు రామయ్య'.ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ వారు ఈ సినిమా ‘యు/ఏ' సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చిత్రం కథ గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న మ్యాటర్ మీరు ఇప్పుడు చదవబోతోంది. ఈ కథ గురించి విన్న వారు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి కాన్సెప్టు తో సినిమా రావటం అనేది ఊహించలేం అంటున్నారు.
ఈ చిత్రంలో అజయ్ కి చిన్న వయస్సులోనే ఇంద్రజతో వివాహం అవుతుంది. అయితే ఆమె ఓ కొడుకుని కన్న తర్వాత మరణిస్తుంది. ఈ నేపధ్యంలో అతను పూల రంగడులా తిరుగుతూంటాడు. అలాగే తనకన్నా తక్కువ వయస్సు ఉన్న ఓ అమ్మాయి వెనక పడుతూంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అజయ్ ఎదిగిన కొడుకు నాగ శౌర్య కూడా అదే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుందామనుకుంటారు. అయితే ఈ విషయం అజయ్ కి తెలిసి ఏం చేసాడు అనేది క్లైమాక్స్ అని చెప్తున్నారు. అయితే ఈ కథలో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాలంటే సినిమా విడుదల అయ్యేవరకూ ఆగాల్సిందే.
నిర్మాత మాట్లాడుతూ... ''వినోదాత్మక ప్రేమకథ ఇది. త్రికోఠి చెప్పిన కథ కొత్తగా ఉంది. మా సంస్థ నుంచి వచ్చిన హిట్ చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా నిలుస్తుంది'' అన్నారు. ఈగ చిత్రంతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా, అందాల రాక్షసి చిత్రంతో ఉత్తమాభిరుచిగల నిర్మాతగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న సాయి కొర్రపాటి ఈ చిత్రం నిర్మాత కావటంతో ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఇదే బ్యానర్ నుంచి విడుదలైన బాలకృష్ణ లెజండ్ చిత్రం ఘన విజయం సాధించిన నేపధ్యంలో ఈ చిత్రం ప్రారంభించారు. ఈ చిత్రంలోనూ అన్ని కమర్షియల్ విలువలూ ఉన్నాయని చెప్తున్నారు.
నాగినీడు, అలీ, విశాల్, రమేష్, హరితేజ, వేణు తదితరులు నటిస్తున్నారు. అజయ్, శౌర్య, ఇంద్రజ, సనాఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాటలు: రమేష్ - గోపి, కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: బి.వి.అమరనాథ్రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, సంగీతం: కీరవాణి.