Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అంటే నాగార్జున హ్యాండ్ ఇచ్చినట్లేనా?
హైదరాబాద్ : ఊహలు గుసగుసలాడే చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన దర్శకుడు అవసరాల శ్రీనివాస్. ఆయన తదుపరి చిత్రం నాగార్జున తో చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు కాన్సిల్ అయ్యిందనే వార్తలు వినపడుతున్నాయి. నాగార్జున మరో కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిత్రం కమిటయినట్లు చెప్పుకుంటున్నారు.
అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి సోగ్గాడు అనే టైటిల్ ని సైతం ఖరారు చేసినట్లు వినపడుతోంది. ఈ మేరకు సోగ్గాడు టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసారు. అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినం చేయనున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం జరుగుతుంది. రమ్యకృష్ణ ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. అన్నపూర్ణ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం నాగార్జున తన కుమారుడు నాగా చైతన్య తాజా చిత్రం రిలీజ్ ని పర్యవేక్షిస్తున్నారు.
'ఒక లైలా కోసం' గురించి నాగ్ మాట్లాడుతూ...ఆ చిత్రం ఇప్పటికే చూశా. ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. మంచి సమయం తీసుకొని విడుదల చేస్తాం. ఈ రోజుల్లో మంచి సినిమా తీయడమే కాదు. సరైన సమయంలో విడుదల చేయడం కూడా ముఖ్యమే. 'మనం'కోసం రెండు నెలలు ఆగాం. మంచి సినిమా తీశాం. విడుదల విషయంలో కాస్త ఆలస్యమైనా ఫర్లేదు అన్నారు.