Don't Miss!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
బాలకృష్ణ తో టచ్ లో ఉంది..అందుకే వర్కవుట్ అయ్యింది
హైదరాబాద్ :సాధారణంగా హిట్ పెయిర్ అని పేరు పడకపోతే ఆ జంటను రిపీట్ చేయటానికి దర్శక,నిర్మాతలు ఆసక్తి చూపరు. కానీ ఇప్పుడు రాధికా ఆప్టే రెండో సారి బాలయ్య ప్రక్కన ఎంపికయ్యి వార్తల్లో నిలించింది. ఆమెను బాలకృష్ణ తాజా చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు. చాలా మంది హీరోయిన్స్ ని వెతికి మళ్లీ ఆమె దగ్గరకే వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆమె ఫుల్ హ్యాపీగా ఉంది.
బాలకృష్ణే స్వయంగా ఆమెను రికమెండ్ చేసారని చెప్పుకుంటున్నారు. లెజండ్ లో ఆమె నటనకు ఇంప్రెస్ అయిన బాలయ్య...ఆమెను తీసుకుందామని చెప్పినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. లెజండ్ అనంతరం ఆమె..బాలయ్యతో టచ్ లోనే ఉండేదని దాంతో హీరోయిన్ అవసరం అనిపించగానే పిలిపించి తీసుకున్నారంటున్నారు.
'లెజెండ్'లో బాలకృష్ణతో ఆడిపాడి ప్రేక్షకులను అలరించిన అందం రాధికా ఆప్టే. అందులో పెద్ద బాలకృష్ణ మేనకోడలుగా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఆమె మరోసారి బాలకృష్ణతో నటిస్తోంది. బాలకృష్ణ తాజా చిత్రంలో ఓ హీరోయిన్ గా రాధికా ఆప్టేను ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష చేస్తోంది.
నిర్మాత మాట్లాడుతూ...''సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కూ సమ ప్రాధాన్యముంటుంది. 'లెజెండ్'లో రాధిక నటనను చూసి ఈ సినిమా కోసం తీసుకున్నాం. ఆమెకు ఈ పాత్ర మంచి పేరు తీసుకొస్తుంది'' అన్నారు.
ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గతంలో మణిశర్మ,బాలకృష్ణ కాంబినేషన్ లో నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి, లక్ష్మీ నరసింహా వంటి చిత్రాలు వచ్చి మ్యూజికల్ గానూ విజయవంతమయ్యాయి. ''బాలకృష్ణ శైలికి తగ్గ కథ ఇది. కుటుంబ అనుబంధాలతోపాటు అభిమానుల్ని అలరించే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ భారీ వ్యయంతో రూపొందించబోతున్నాం.''అని దర్శకుడు తెలిపారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో జరుగుతోంది. సత్యదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రుద్రపాటి రమణారావు నిర్మాత. ఇందులో బాలకృష్ణ సీబీఐ అధికారిగా కనిపిస్తారని సమాచారం. బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: వెంకటప్రసాద్. కళ: రవీందర్.