Don't Miss!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అక్కినేని అఖిల్ తొలి సినిమాకు నిర్మాత హీరో నితిన్?
హైదరాబాద్: నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ త్వరలో హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ‘మనం' సినిమాలో అఖిల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చినప్పటి నుండి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో అఖిల్ ని చూసి మెస్మరైజ్ అయిన అభిమానులు ఈ సిసింద్రి హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఎదురుచూస్తున్నారు. మరో పక్క, అఖిల్ హీరోగా ఓ సినిమా 2015కల్లా కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, వివినాయక్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా స్టార్ట్ అవబోతోందట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ రూపొందించిన "అల్లుడు శీను" బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేసింది. దాంతో, నాగార్జున స్వయంగా వివి వినాయక్ ని కలిసి, అఖిల్ ఫస్ట్ ఫిల్మ్ కి దర్శకత్వం వహించమని కోరాడని సమాచారం.
ఈ చిత్రాన్ని తొలుత తన సొంత బేనర్లోనే నిర్మించాలని నాగార్జున అనుకున్నప్పటికీ...తన బేనర్లో నిర్మిస్తానంటూ హీరో నితిన్ ముందుకు వచ్చినట్లు ఫిల్మ్ టాక్. నితిన్కు చెందిన శ్రేష్ఠ్ మూవీస్ బేనర్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. మరి ఈ వార్తలో నిజం ఎంతో తేలాల్సి ఉంది.