Don't Miss!
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
సుకుమార్ కు సినిమా ఓకే అయ్యింది
హైదరాబాద్ : 1 నేనొక్కడినే చిత్రం పరాజయంతో సుకుమార్ కి తెలుగులో అనుకున్నట్లగా సినిమా రాలేదు. పెద్ద హీరోలు ఎవరూ ఆసక్తి చూపలేదు. దాంతో ఎన్టీఆర్ తో సినిమా ఉందని వచ్చినా తర్వాత లేదని చెప్పుకున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ కి సుకుమార్ కథ చెప్పారు కానీ ఓకే కాలేదని వినిపించింది. అయితే తాజాగా ఎన్టీఆర్ తో ప్రాజెక్టు అయినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
ఇక ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ కోసం అభిమానులు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. 1 నేనొక్కడినే చిత్రం విడుదల అయిన వెంటనే ఈ చిత్రం ఉంటుందని భావించారు. అయితే రకరకాల కారణాలతో ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు. తాజాగా ఈ ప్రాజెక్టు ఓకే అయ్యిందని, ఎన్టీఆర్ 25 వ చిత్రంగా ఇది ఉండబోతోందని తెలుస్తోంది.
రీసెంట్ గా ఎన్టీఆర్ ని సుకుమార్ కలిసి కథ చెప్పారని, దానికి వెంటనే ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ చిత్రాన్ని రిలియన్స్, ఎస్ వి సిసి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. సంక్రాంతి 2016 లో ఈ చిత్రం విడుదల కానుంది. పూరీ చిత్రం తర్వాత ఈ చిత్రం పట్టాల ఎక్కనుందని తెలుస్తోంది. నాగార్జున, పీవీపి కాంబినేషన్ లో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా ఆగిందని, దాని ప్లేసులో ఇది వచ్చిందని తెలుస్తోంది.