Don't Miss!
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- News దేశ రాజకీయాల్లో ఆ ఘనత సాధించిన ఒకేఒక్కడు పవన్ కళ్యాణ్
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
ఎన్టీఆర్ కి ఆగ్రహం... నచ్చచెప్తున్నారు
హైదరాబాద్: ఫలానా తేది విడుదల చేస్తామని అథికారికంగా ప్రకటించాక ఆ తేది కోసం అభిమానులు ఎదురుచూస్తూంటారు. అందుకే పెద్ద హీరోలు ఎవరూ తన సినిమాలను అర్దాంతరంగా వాయిదాలు వేస్తే ఊరుకోరు. మొదట ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకునే విడుదల తేదీని బయిటకు ఇస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్ధితే ఎన్టీఆర్ తాజా చిత్రం రభస ఎదుర్కొంటోంది. ఈ చిత్రం ఆగస్టు 15 న విడుదల చేద్దామని మొదట నుంచీ చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అర్దాంతరంగా రిలీజ్ తేది మారింది. ఆగస్టు 28న రభస ని విడుదల చేయాలని నిర్ణయించారు.
బెల్లంకొండ సురేష్ తన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ లాంచింగ్ చిత్రం అల్లుడు శీను..ని అర్దాంతరంగా థియోటర్స్ నుంచి లేపేయటానికి మనసొప్పక..బెల్లంకొండ వాయిదా అడిగాడని సమాచారం. అయితే ఎన్టీఆర్...తన అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈ వాయిదాని వ్యతిరేకించినట్లు చెప్పుకుంటున్నారు.
అయితే దిల్ రాజు వంటి నిర్మాతలు సైతం...నైజాం లో ...ఓ ప్రక్క అల్లుడు శీను,మరొక ప్రక్కన రన్ రాజా రన్ ఆడుతున్నాయని, వాటి కలెక్షన్స్ బాగున్నప్పుడు తీసేయకుండా కాస్త గ్యాప్ తీసుకుందామని చెప్పి ఒప్పించినట్లు చెప్పుకుంటున్నారు. అప్పటికీ ఎన్టీఆర్ చాలా అసంతృప్తిగా ఉన్నాడని అంటున్నారు. మరొక ప్రక్క రభస పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఇంకా పూర్తి కాలేదని అదొక కారణంగా చూపిస్తున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే అదే రోజు సికిందర్ చిత్రం కూడా రిలీజ్ అవుతోంది. సికిందర్ చిత్రం పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. సూర్య హీరోగా ఉండటం, దర్శకుడు లింగుస్వామి చిత్రం కావటం, సమంత హీరోయిన్ కావటం, లగడపాటి శ్రీధర్ నిర్మాత కావటం వంటి అంశాలు ఈ చిత్రం ఓపినింగ్స్ కి బాగా ఉంటాయని, థియోటర్స్ సమస్య ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు.