Don't Miss!
- News పడమర దిక్కు తల పెట్టుకుని పడుకోవడం మంచిదేనా..?
- Sports Hardik Pandya: అస్సలు ఊహించలేదు.. ఆ తప్పిదమే మా కొంపముంచింది!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Technology WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
ఎన్టీఆర్ పగ తీర్చుకునేది ‘పల్నాడు’ లో
హైదరాబాద్ : రాయలసీమ ఫ్యాక్షనిజం ...సినిమావాళ్లకు చాలా కాలంగా వరంగా ఉంటూ వస్తోంది. సెకండాఫ్ లో హీరో వెళ్లి రాయలసీమ లో ఫ్యాక్షనిస్ట్ లతో పోరాడి...అవసరమనుకుంటే వారిని మార్చేసి వచ్చేస్తూంటాడు. అయితే అది పరమ రొటీన్ అయిపోయింది. అందుకే రకరకాల నేపధ్యాలు వెతుకుతున్నారు దర్శకులు. అందులో భాగంగా...ఇప్పుడు పల్నాడు ముందుకు వచ్చిందని సమాచారం. ఎన్టీఆర్ చేయబోయే చిత్రం పల్నాడు బ్యాక్ డ్రాప్ లో రూపొందనుందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
జూ. ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో తొలిసారిగా ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో రకరకాల టాక్ లు నడుస్తున్నాయి. సుకుమార్..ఈ సారి ఖచ్చితంగా హిట్ కొట్టడానికి రంగం సిద్దం చేసుకున్నాడని అంటున్నారు. మే నుంచి ప్రారంభమయ్యే ఈ చిత్రం తండ్రి సెంటిమెంట్ ప్రధానంగా,రివేంజ్ తీర్చుకునే విధంగా సాగుతుందని అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం..సెకంఢాఫ్ మొత్తం పల్నాడులో జరుగుతుందని అంటున్నారు.
ఫస్టాఫ్ మొత్తం యుకె లోనూ సెకండాఫ్..రాయలసీమ లోనూ సుకుమార్ సెట్ చేసాడని అంటున్నారు. జగపతిబాబు కీ రోల్ లో కనిపించే ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తోంది. ఎన్టీఆర్ తండ్రి..రాయలసీమ ప్రాంతంలో న్యాయం కోసం పోరాడి దెబ్బ తింటాడని,కొడుకు వచ్చి తన దైన శైలిలో న్యాయం చేస్తాడని ఇదే స్టోరీ లైన్ అని చెప్పుకుంటున్నారు. హై వోల్టేజ్ డ్రామా గా సెకండాఫ్ నడుస్తుందని అంటున్నారు.
అలాగే ఈ సినిమాకు ‘దండయాత్ర' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్రకు జగపతిబాబుని ఎంపిక చేసుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
మరిన్ని విశేషాలకి వెళ్తే...
టెంపర్ హిట్తో మంచి జోష్ మీద ఎన్టీఆర్ తన నెక్ట్స్ చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ చిత్రం. ఈ చిత్రాన్ని సుకుమార్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం అఫీషియల్ లాంచింగ్ ని యుకే లో చేస్తున్నట్లు సమాచారం.
అక్కడ షూటింగ్ రెగ్యులర్ గా జరుపుతాం కాబట్టి అక్కడే లాంచింగ్ పెట్టుకుంటే మంచిదని ఈ నిర్ణయానికి దర్శక,నిర్మాతలు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుకుమార్ గత చిత్రం 1,నేనొక్కిడినే గ్లోబల్ మార్కెట్ లోనే మనకు ఇక్కడ లోకల్ కన్నా ఎక్కవ కలెక్టు చేయటం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి ఓ కారణం అని చెప్తున్నారు.
అలాగే అక్కడ ఓ తెలుగు చిత్రం లాంచింగ్ అనేది ఇప్పటివరకూ జరగలేదు కాబట్టి హైలెట్ గా నిలుస్తుంది...అంతేకాకుండా అక్కడ ఉండే మన తెలుగు వారికీ ఆనందం కలిగించినట్లు ఉంటుందని ఎన్టీఆర్ భావించి,గ్రీన్ సిగ్నల్ ఇచ్చిట్లు చెప్తున్నారు. దీంతో ఓవర్ సీస్ మార్కెట్ లో సైతం ఎన్టీఆర్ కు క్రేజ్ పెరిగే అవకాసం ఉంది. జనవరి 8,2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేయనుంది. జగపతిబాబు కీలకమైన పాత్రలోనూ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోనుంది.
ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం పూజా కార్యక్రమాలు డిసెంబర్ 18 ఉదయం 11.39 గంటలకు సంస్ధ కార్యాలయం చెన్నైలో జరిగాయి.
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది అన్నారు.