Don't Miss!
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
మొత్తానికి ఎన్టీఆర్ ఓకే అన్నాడు,ఏం చేస్తాడో?
హైదరాబాద్: చాలా కాలంగా వక్కంతం వంశీ దర్శకుడుగా లాంచ్ అవటానికి ఎదురుచూపులు చూస్తున్నాడు. అదీ వేరే హీరోతో ముందుకు వెళ్లాలనుకుంటే కోరిక తీరిపోయేదేమో. ఆయన బిజీగా ఉన్న ఎన్టీఆర్ ని డైరక్ట్ చేయాలనుకున్నాడు. ఎన్టీఆర్ కూడా మాట ఇవ్వటంతో వెయిటింగ్ లోనే చాలా కాలం గడిపాడు.
అంతేకాదు చాలా సార్లు మీడియా ముందు తన తొలి చిత్రం ఎన్టీఆర్ ని డైరక్ట్ చేయబోతున్నానని, కథ రెడీ అవుతోందని చెప్పాడు. అయితే ఇంతకాలం అందుకు సమయం రాలేదు. రీసెంట్ గా వక్కంతం వంశీ కి ఎన్టీఆర్ ..స్క్రిప్టు ని లాక్ చేసుకోమని చెప్పారని సమాచారం.
సెప్టెంబర్ నుంచి సినిమా మొదలు పెడదామని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్ట్రార్ట్ చేసుకోమని పురమాయించినట్లు సమాచారం. దాంతో జూన్ నుంచి వక్కంతం వంశీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించి, ఆ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం పూర్తి స్దాయి...యాక్షన్ ఎంటర్టైనర్ అని, ఊహించని ట్విస్ట్ లతో సాగే విభిన్నమైన కథనంతో వక్కంతం తన తొలి చిత్రం కథను రెడీ చేసుకున్నట్లు చెప్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్...తన తాజా చిత్రం జనతా గ్యారేజ్ బిజీలో ఉన్నారు. ఆగస్టు 12 న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ ప్లానింగ్ మేరకు కొరటాల శివ శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ చేస్తున్నారు.