Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రభుత్వం కంటే పవన్ కళ్యాణే ఎక్కువా?
హైదరాబాద్: హుధూద్ తుఫాన్ కారణంగా విశాఖపట్నం సిటీతో పాటు చుట్టుపక్కల జిల్లాలు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. తుపాన్ బాధితులను ఆదుకునేందుకు ఎవరికి తోచిన సహాయం వారు చేసారు. సినిమా రంగానికి చెందిన ప్రముఖులంతా భారీగా విరాళాలు అందించారు. ప్రధాని మోడీ విశాఖలో పర్యటించారు. 1000 కోట్లు సహాయం ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు 400 కోట్లు మాత్రమే విడుదల చేసారు.
కాగా...తెలుగు సినిమా పరిశ్రమ నుండి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అత్యధికంగా రూ. 50 లక్షలు సహాయం అందించి అందరికంటే ముందు ఉన్నారు. స్వయంగా వెళ్లి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ విషయమై కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందిస్తూ తమ దృష్టిలో ప్రభుత్వం కంటే పవన్ కళ్యాణే ఎక్కువ సహాయం చేసారని అంటున్నారు.
ప్రధాని మోడీ విశాఖలో పర్యటించి ప్రభుత్వం తరుపున సహాయం ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బును విరాళంగా ప్రకటించారు.....ఆయన సహాయ గుణం పరంగా చూస్తే ప్రభుత్వం కంటే ఎక్కువే చేసారు అని అంటున్నారు ఫ్యాన్స్. నిజమే...వారు చెబుతున్నదాంట్లోనూ పాయింటు ఉంది.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన ‘గోపాలా గోపాలా' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. దీని తర్వాత ఆయన గబ్బర్ సింగ్-2 చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నారు.