Don't Miss!
- News తారకరత్న భార్య బిగ్ ట్విస్ట్ ..ఆ పార్టీకే మద్దతంటూ ప్రకటన
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
‘పికె’ వివాదం: 8 కోట్లు ఇచ్చి ఆపమన్నారట!
హైదరాబాద్: అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పికె' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజు 26 కోట్లకు పైగా వసూలు చేసిన ఈచిత్రం రూ. 100 కోట్లకు చేరువైంది. ఈ చిత్రం టోటల్ బిజినెస్ రూ. 200 కోట్లు దాటుతుందని అంచనా.
ఈ చిత్రంలో అమీర్ ఖాన్ ఎంట్రీ నగ్నంగా, విచిత్రంగా ఉంటుంది. ఆయన ఇందులో భోజ్పురి మాట్లాడే ఆస్ట్రోనాట్గా కనిపించారు. ఇండియాలోని మత వ్యవస్థపై సైటైర్లు వేస్తూ ఈ సినిమా సాగింది. అయితే తాజాగా ఈ చిత్రంపై ఓ వివాదం నెలకొంది. ఈచిత్రం సెకండాఫ్ గతంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓహ్ మై గాడ్' సినిమాను పోలిఉందనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
‘ఓ మై గాడ్' చిత్ర సబ్జెక్టు ‘పికె'కు సమీపంగా ఉండటంతో....రెండేళ్ల క్రితం ‘ఓ మై గాడ్' చిత్రీకరణ దశలో ఉన్నప్పుడు సినిమా ఆపి వేయాలని దర్శకుడు ఉమేష్ శుక్లాను అమీర్ ఖాన్, విధు వినోద్ చోప్రా, రాజ్ కుమార్ హిరానీ కలిసారని, రూ. 8 కోట్లు కూడా ఆఫర్ చేసారని తెలుస్తోంది.
అయితే ఉమేష్ శుక్లా....వారి మాట వినకుండా, డబ్బు తీసుకోకుండా సినిమాను కంప్లీట్ చేసాడు. తర్వాత ఓ మై గాడ్ చిత్రం పెద్ద హిట్టయింది. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చి పెట్టింది.