Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రభాస్ రావడం వెనక చిరంజీవిపై కోపం ఉందట!
హైదరాబాద్: వరుణ్తేజ్, దిశాపటాని హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫర్' చిత్ర ఆడియో వేడుక డిసెంబర్ 7న జరగనుంది. ఈ వేడుకకు ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారట. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా వస్తాడని అనుకున్నప్పటికీ ప్రభాస్ను ఆహ్వానించాడు పూరి.
150వ సినిమా అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి తనను కాదన్నందుకు పూరి కోపంగా ఉన్నారని.... ఆ కారణంగానే చిరంజీవిని పిలవడం ఇష్టం లేక ప్రభాస్ను చీఫ్ గెస్టుగా పిలిచాడనే ప్రచారం జరుగుతోంది. చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ నుండి ఎవరినీ పిలవడం లేదు పూరి. అయితే ఈ చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేసారు. చిరంజీవిగారు ఈ సినిమా కోసం వీడియో బైట్ ఇచ్చారని, దాన్ని ఆడియో వేడుకలో ప్రదర్శిస్తామని తెలిపారు.
లోఫర్ చిత్రాన్ని 18 డిసెంబర్ న విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు తేదీ ని లాక్ చేసినట్లు సమచారం. ఈ చిత్రంలో రేవతి, పోసాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్కు ఇంటర్నెట్లో విశేష స్పందన లభిస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా ఇటీవల విడుదలైన 'కంచె' చిత్రం బాక్సాఫీసు వద్ద డీసెంట్ హిట్టయింది. ఈ నేపథ్యంలో లోఫర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమాకు లోఫర్ అని టైటిల్ పెట్టడంపై పూరి స్పందిస్తూ...కథలో భాగంగానే ఆ పేరు పెట్టాం. ఇందులో కథానాయకుడికి పనీ పాట ఏమీ ఉండదు. కానీ చివరికి మంచివాడిలా మారతాడు. ఈ పేరు ఎందుకు పెట్టామో సినిమా చూశాక బాగా అర్థమవుతుంది అని తెలిపారు.