Don't Miss!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- News కడప కోర్టు ఆంక్షలపై హైకోర్టుకు సునీత..! వైసీపీపై కీలక వ్యాఖ్యలు..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
ఆ భయంతోనే...నాగార్జునకు ప్రణీత నో ?
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది,ఎన్టీఆర్ సరసన రభస చిత్రాలు చేసి మంచి జోరు మీద ఉన్న ప్రణీత...రీసెంట్ గా నాగార్జున కు నో చెప్పినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దాంతో అందాల రాక్షిసి ఫేమ్...లావణ్య త్రిఫాఠి ని తీసుకున్నట్లు చెప్తున్నారు. ప్రణీత ఎందుకు నో చెప్పింది అన్నదానికి కారణాలు తెలియలేదు. కొందరు మాత్రం సీనియర్ హీరోల ప్రక్కన చేస్తే యంగ్ హీరోలు ఛాన్స్ ఇవ్వరనే భయంతో నో చెప్పిందంటున్నారు.
గతంలోనూ వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల ప్రక్కన చేసిన హీరోయిన్స్ ని సీనియర్స్ గా భావించి తిరిగి వారి ప్రక్కనే ఆఫర్స్ వచ్చాయని, ప్రస్తుతం మార్కెట్ లో అదరకొడుతున్న కుర్ర హీరోలు ..వారు తమ ప్రక్కన పెద్దగా కనపడతారని వద్దంటున్నారని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వద్దందంని చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో నిజముందనేది ప్రణీతకు మాత్రమే తెలియాలి. ఇంతకీ ఆ చిత్రం మరేదో కాదు... 'సోగ్గాడే చిన్నినాయనా'.
'సోగ్గాడే చిన్నినాయనా' డిటేల్స్ లోకి వెళితే...
నాగార్జున ద్విపాత్రాభినయంలో తెరకెక్కుతున్న చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా'. లావణ్య త్రిపాఠి హీరోయిన్. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలోని ఠాగూర్ హౌస్లో నాగార్జున, బ్రహ్మానందంపై వినోద సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో బ్రహ్మానందం స్వామీజీ గెటప్తో నవ్వించబోతున్నారని సమాచారం.
నిర్మాత రామ్మోహన్రావుతో కలిసి అన్నపూర్ణ స్టూడియో పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో నాగార్జున తాత, మనవడి పాత్రల్లో ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలిసింది.
ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో ఆయన పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని చెబుతున్నారు సునిశితమైన హాస్యం, వ్యంగం మేళవింపులతో వినూత్న పంథాలో సాగే కథాంశమిదని చిత్ర వర్గాలు అంటున్నాయి.
''నాగార్జున నుంచి రాబోతున్న మరో వైవిధ్యమైన చిత్రమిది. ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచేలా రూపొందుతోంది. అన్ని వర్గాలను ఆకట్టుకొనేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాము''అని దర్శక,నిర్మాతలు చెబుతున్నాయి. చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్, కళ: ఎస్.రవీందర్