Don't Miss!
- News సీఎం జగన్ వద్దకు భూమా అఖిల ప్రియ.. తరువాత ఏం జరిగిందంటే..!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
అంటే మహేష్ తో లేనట్లా?
హైదరాబాద్ : మహేష్ బాబు, పూరి జగన్నాథ్ వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో పోకిరి, బిజినెస్ మ్యాన్ వంటి సూపర్ హిట్స్ వచ్చాయి. దాంతో ఈ కాంబినేషన్ మరోసారి రెడీ అవ్వబోతోందంటూ వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ తో పూరీ చేస్తున్న చిత్రం పూర్తవగానే ఈ చిత్రం మొదలవుతుందని అన్నారు. అయితే ఇప్పుడు మంచు విష్ణుతో ఓ తమిళ చిత్రం రీమేక్, రానా తో ఓ చిత్రం నిమిత్తం పూరీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే...స్పీడుగా సినిమాల్ని తెరకెక్కించడంలో దిట్ట.. పూరి జగన్నాథ్. ఒక సినిమా సెట్స్పై ఉండగానే మరో సినిమా గురించి ఆలోచిస్తారు. ప్రస్తుతం అదే పనిచేస్తున్నారు. ఆయన ఎన్టీఆర్ హీరో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈలోగా రానా కోసం మరో కథ సిద్ధం చేస్తున్నారు. రానా, పూరిల కలయికలో 'నేను నా రాక్షసి' వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ కలయిక పట్టాలెక్కబోతోందని సమాచారం.
తెలుగు, హిందీ భాషల్లో పూరి ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని, అందులో రానా హీరోగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. రానాకి హిందీలో మంచి గుర్తింపు ఉంది. దానికి తోడు పూరి 'బుడ్డా బన్ గయా తేరా బాప్' చిత్రంతో బాలీవుడ్లో విజయం సాధించారు. అందుకే ఈ కలయికకు రంగం సిద్ధమైందన్నమాట. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. ఈ ప్రాజెక్టు కనుక పట్టాలు ఎక్కితే ఇప్పట్లో మహేష్ తో చిత్రం లేనట్లే కదా.