Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
‘పివిపి’ మంచి మనసు: ‘బ్రహ్మోత్సవం’ బాధితులను ఆదుకుంటారట!
హైదరాబాద్: భారీ అంచనాలతో వచ్చిన మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం' సినిమా ప్లాప్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ ధరలకు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి.
ఈ చిత్రాన్ని రిలీజ్ ముందే నిర్మాత పివిపి లాభాలకు అమ్మేసారు. అయితే సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి తలక్రిందులైంది. ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు చాలా ఏరియాల్లో 60 శాతమ మేర నష్టపోయే అవకాశం ఉందని, మరికొన్ని ఏరియాల్లో 40 శాతం మేర నష్టాలు తప్పని అంచనా వేస్తున్నారు.
'బ్రహ్మోత్సవం': చూడకుండా అడ్డుకునే ప్రయత్నం, ప్రతీకారమా?
అయితే నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకుంటానని పివిపి మాట ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నష్టాల్లో సగం తాను భరిస్తానని, డబ్బులు తిరిగి ఇష్తానని భరోసా ఇచ్చినట్లు సమాచారం. సినీ పరిశ్రమలో ఇవన్నీ మామూలే అయినా.... నిర్మాత పివిపి మంచి మనసుతో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై డిస్ట్రిబ్యూటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక బ్రహ్మోత్సవం సినిమా చూసిన ప్రేక్షకులు కూడా....తాము బాధితులమే అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా గోడు వెల్లబోసుకుంటున్నారు. తమలా మరొకరు ఇలా బాధితులు కావొద్దంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారమే సినిమాను మరింత దెబ్బతీస్తోంది.