Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రీమేక్ లో....మంచు విష్ణు, రాజ్ తరుణ్
హైదరాబాద్: ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ చిత్రాలతో హిట్ హీరోగా మారిన రాజ్ తరుణ్ కి వరస ఆఫర్స్ చుట్టముడుతున్నాయి. ప్రస్తుతం సుకుమార్ నిర్మిస్తున్న కుమారి 21ఎఫ్ లో చేస్తున్న రాజ్ తరుణ్ ...చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఇవి సెట్స్ మీద ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్ ను అంగీకరించాడు .
మంచు విష్ణు హీరోగా చేయనున్న ఓ సినిమాలో రాజ్ తరుణ్ ను మరో హీరోగా ఎంపిక చేశారని ఫిల్మ్ నగర్ సమాచారం. పంజాబీలో సూపర్ హిట్ అయిన ఓ కామెడీ చిత్రం రీమేక్ లో వీరిద్దరూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను చాలా కాలం క్రితమే తీసుకున్నాడు మంచు విష్ణు. అయితే అప్పటినుంచి ఈ సినిమా వాయిదా అవుతూ వస్తోంది.
తాజాగా ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు విష్ణు. విష్ణు తో గతంలో దేనికైనా రెడీ సినిమాను డైరెక్ట్ చేసిన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు హీరోలు ఉండే ఈ సినిమా కోసం విష్ణుతో పాటు రాజ్ తరుణ్ ను మరో హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు.
ప్రస్తుతం సుశాంత్ హీరోగా ఆటాడుకుందాం రా సినిమాను తెరకెక్కిస్తున్న నాగేశ్వరరెడ్డి. ఆ సినిమా పూర్తయిన తరువాత విష్ణు, రాజ్ తరుణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా పని మొదలెట్టనున్నాడు.