Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి?
హైదరాబాద్ : గతంలో జరిగిన పోరపాటు ...పొరపాటున కూడా మళ్లీ జరగకుండా ఉండేందుకు రాజమౌళి ప్రయత్నిస్తున్నారు. అందుకు గాను ఆన్ని జాగ్రత్తులు తీసుకుంటున్నారు. ఎవర ఏమనుకున్నా ఫరవాలేదని టీమ్ ని హెచ్చరిస్తున్నారు.
ఇదంతా దేనికి అంటే బాహుబలి - ది బిగనింగ్ లో జరిగిన లీకేజ్ గురించి. ఈ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాడు. రీసెంట్ గా సినిమా ప్రారంభానికి ముందే టీమ్ ను కూర్చోబెట్టి.. ఓ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా సమాచారం. అందులో భాగంగానే మెబైల్ ఫోన్ వాడకుండా నిషేదం పెట్టినట్లు సమాచారం. అలాగే కీరవాణీ పాటలు కూడా ఆడియో విడుదలకు ముందుగానే బయటకు వచ్చిన నేపద్యంలో ఆ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి: ది కన్క్లూజన్ షూటింగ్ గురువారం రామోజీ ఫిల్మ్సిటీలో ప్రారంభమైంది. ప్రభాస్, రమ్యకృష్ణ మీద వచ్చే సన్నివేశాలతో ఈ షూటింగ్ ప్రారంభమైంది. రెగ్యులర్ గా ఈ షూటింగ్ ఎటువంటి బ్రేక్ లేకుండా జరగనుంది. గత కొద్ది రోజులుగా ఈ చిత్రం సెట్స్ వేస్తూండటం, స్క్రిప్టుపై కసరత్తులతో టీమ్ గడపింది.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. జులై 10న విడుదలైన బాహుబలి: ది బిగినింగ్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.