Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గెస్ట్ లుగా...రికార్డ్ లు బ్రద్దులవుతాయోమో
హైదరాబాద్: పరవ్ స్టార్ , మెగా పవర్ స్టార్ ఒకే సినిమాలో గెస్ట్ లుగా నటిస్తే ఎలా ఉంటుంది..ఆ ..అది జరిగేపనేనా అంటున్నారా..అయితే అందుకు జరిగేందుకు అవకాసముందని తెలుస్తోంది. చిరంజీవి 150 వ చిత్రం చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న నేపధ్యంలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఈ సినిమాలో కనిపించాలని నిర్ణయంచుకున్నట్లు సమచారం.
ఈ మేరకు చిరంజీవి మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఇది తన 150 వ చిత్రం మాత్రమేనని, ఇదేమీ తన ఆఖరి చిత్రం కాదు కదా..ఎందుకు మీరంతా అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే రామ్ చరణ్ మాత్రం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
. ఇక.. చిరంజీవి 150వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారాయన. తమిళంలో ఘనవిజయం సాధించిన 'కత్తి' చిత్రం రీమేక్లో చిరంజీవి నటించనున్న విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. తమిళ టైటిల్నే తెలుగుకి కూడా పెడతారనే టాక్ వినిపించింది.అయితే, 'కత్తిలాంటోడు' అనే టైటిల్ని ఫైనల్ చేసారని , చిరునే చెప్పి ఆనందపరిచారు.
మరో ప్రక్క..ఈ 150వ చిత్రం... ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? హీరోయిన్ ఎవరు...? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇవన్నీ అభిమానులను తొలిచేస్తున్న ప్రశ్నలు. ముఖ్యంగా ఈ చిత్ర మాతృక కథ మీద వివాదం చెలరేగడంతో కొంత కాలం హాట్ టాపిక్గా మారింది.
అయితే వీవీ వినాయక్ మాత్రం ఆ వివాదాలేమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతున్నట్లు సమచారం. తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ సినిమా స్క్రిప్ట్ను తీర్చిదిద్ది, చిరంజీవికి కూడా వినిపించారని సమాచారం.
స్క్రిప్ట్ విన్న చిరంజీవి ఆనందపడిపోయి, వినాయక్ను హగ్ చేసుకున్నారని చెప్పుకుంటున్నారు. దాంతో ఇక షూటింగ్ మొదలుపెట్టడమే ఆలస్యం. ఈ చిత్రాన్ని హీరో రామ్చరణ్ నిర్మించనున్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా నయనతార పేరు వినపడుతోంది.