Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
చిరంజీవి తర్వాత జూ ఎన్టీఆరే అంటూ ప్రచారం: ఈ పుకార్ల వెనక ఎవరు?
రామ్ చరణ్ తన బేనర్లో మూడో సినిమాగా జూ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్నారని, ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతున్నారంటూ ఓ రూమర్ తాజాగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'కొణిదెల ప్రొడక్షన్స్' సంస్థను స్థాపించి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తొలి సినిమాగా తన తండ్రి 150వ సినిమాను తెరకెక్కిన చరణ్... తొలి ప్రయత్నంలోనే భారీ విజయం తన ఖాతాలో వేసుకున్నారు.
ఇక కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలో రెండో ప్రాజెక్టు కూడా తన తండ్రి చిరంజీవితోనే చేయబోతున్నారు రామ్ చరణ్. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి చిరు 151వ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.
కాగా... రామ్ చరణ్ తన బేనర్లో మూడో సినిమాగా జూ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్నారని, ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతున్నారంటూ ఓ రూమర్ తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ పుకార్ల వెనక ఎవరు?
అయితే చరణ్ నిర్మాత ఎన్టీఆర్ సినిమా అనే వార్తలో ఏ మాత్రం నిజం లేదని అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. ఈ పుకార్ల వెనక ఎవరున్నారో తెలియదు కానీ... ఇది వార్త పచ్చి అబద్దం అంటున్నారు.
ఆల్రెడీ
ఆల్రెడీ జూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాకు సంబంధించి అఫీషియల్ న్యూస్ ఇప్పటికే వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రం ను నిర్మించ నున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్
ఎన్టీఆర్-త్రివిక్రమ్ వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే ఈ తొలి చిత్రాన్ని తమ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించటం, నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ప్రకటించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపిన సంగతి తెలిసిందే. 2017 సెప్టెంబర్ లో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు చెప్పారు కూడా.
‘ఖైదీ నెం 150’....ఇన్కం టాక్స్లో రామ్ చరణ్ చూపిన లాభాల లెక్కలు ఇవే?
‘ఖైదీ నెం 150'....ఇన్కం టాక్స్లో రామ్ చరణ్ చూపిన లాభాల లెక్కలు ఇవే?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి