twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి’ సెట్ కాల్చేసారా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' భారీ ప్రాజెక్టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ చిన్న పాటి సెట్లో షూటింగ్ పూర్తయిన తర్వాత దాన్ని కాల్చేసినట్లు సమాచారం. సెంటిమెంటు పరంగా కలిసొస్తుందని ఆ సెట్ కాల్చేసారని అంటున్నారు.

    ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంకా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడవి శేష్, సందీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రానా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీతో విదేశీ బాషల్లో కూడా విడుదల చేస్తారట.

    Bahubali

    ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. దాదాపు సంవత్సర కాలంగా షూటింగ్ ప్రక్రియ సాగుతూనే ఉంది. సినిమాను ఎలాగైన ఏప్రిల్ 2015 నాటికి ప్రేక్షకుల ముందుకు తేవాలని నిర్ణయించుకున్న రాజమౌళి....స్పీడు పెంచారు.

    మొత్తం పూర్తయ్యే వరకు నాన్ స్టాప్‌గా ఎక్కడా ఆపకుండా షూటింగ్ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ మేరకు యూనిట్ సభ్యులందరినీ అప్రమత్తం చేసారు. షూటింగ్

    పూర్తయ్యే వరకు ఎవరూ ఎలాంటి ఇతర పనులు పెట్టుకోకూడదని సీరియస్‌గా చెప్పినట్లు తెలుస్తోంది. రెండు పార్ట్స్ కాబట్టి పెట్టిన పెట్టబడి గ్యారంటీగా తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకైతే రాజమౌళి అంచనాలు తప్పలేదు. ఏది చేసినా ముందు దాని గురించి క్షుణ్ణంగా స్టడీచేసి పర్‌ఫెక్టుగా చేయడం ఆయన స్టైల్.

    English summary
    It is said that Rana will appear in dual roles in Bahubali.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X