Don't Miss!
- News సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్న కవిత: ఎందుకంటే?
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Technology Lava నుంచి కొత్త స్మార్ట్ ఫోన్! మార్చి 22 న లాంచ్,టీజర్ విడుదలైంది
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
పవన్ వద్దన్నాడు కాబట్టే రవితేజ: బెంగాల్ టైగర్?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్-2' చిత్రం తెరరెక్కాల్సి ఉంది. అయితే స్క్రిప్టు నచ్చక పోవడంతో పవన్ కళ్యాణ్ మార్పులు కోరాడు. ఎన్ని సార్లు మార్పులు చేసినా పవన్ కళ్యాణ్ను మాత్రం మెప్పించలేక పోయాడు. రెండేళ్ల సమయం వృధా అయినా....పవన్ కళ్యాణ్ మాత్రం ఏ విషయం తేల్చక పోవడంతో మేల్కొన్న సంపత్ నంది తన దారి తను చూసుకున్నాడు.
పవన్ కళ్యాణ్ రిజక్టు చేసిన కథను రవితేజకు వినిపించి ఓకే చేయించుకున్నాడు ఫిల్మ్ నగర్ టాక్. ఆ కథను పవన్ కళ్యాణ్ రిజక్టు చేసాడని తెలిసి కూడా రవితేజ సంతోషంగా ఓకే చెప్పాడట. అందుకు కారణం ఓ సెంటిమెంటు అని అంటున్నారు. గతంలో రవితేజ నటించిన ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రాలు మంచి విజయం సాధించాయి. కెరీర్ తొలి నాళ్లలో ఆ విజయాలు రవితేజను పెద్ద స్టార్ను చేసాయి. వాస్తవానికి ఈ రెండు సినిమా కథలు తొలుత పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి తిరస్కరణకు గురయ్యాయి.
అలా పవన్ కళ్యాణ్ వద్దన్న కథల్లో నటించని రవితేజ విజయాలు సొంతం చేసుకున్నాడు. ఇపుడు సంతప్ నందికి ఓకే చెప్పడం వెనక కూడా ఆ సెంటిమెంటే కారణమని అంటున్నారు. సాధారణంగా రవితేజ కథ ఓకే చేసాడంటే...అది ఆయన ఎనర్జీకి తగిన విధంగా ఉంటుందని అర్థం. ఆయన ప్లాన్ వర్కౌట్ అవుతుందనే భావిస్తున్నారు.
కాగా...సంతప్ నంది ఈచిత్రానికి బెంగాల్ టైగర్ అని పేరు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్ పేరు కూడ సిద్ధార్థరాయ్ అని ఉంటుందట. ఇది గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి' చిత్రంలోని క్యారెక్టర్ పేరు. ఈ పేరు పెట్టడం కూడా సెంటిమెంటుగా కలిసొస్తుందని భావిస్తున్నారు.