Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇక డైరెక్షన్ ఆపేస్తానంటున్న సుకుమార్!
హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ లీగ్ లో కొనసాగుతున్న దర్శకుల్లో సుకుమార్ ఒకరు. రోటీన్ సినిమాలకు భిన్నంగా, ఇంటలిజెంట్ కాన్సెప్టుతో సినిమాలు చేయడం ఆయన ప్రత్యేకత. అందుకే స్టార్ హీరోలంతా సుకుమార్ డైరెక్షన్లో చేయాలని ఉవ్విల్లూరుతుంటారు. అయితే మరో రెండు సినిమాల తర్వాత సుకుమార్ ఇక దర్శకత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జీవి ఇంటర్వ్యూలో ఆయన ఈ మాట అన్నారట. మరి ఆయన నోట నుండి ఇలాంటి మాట ఎందుకు వచ్చింది? అనేది పూర్తి ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత తేలనుంది.
గతంలోనూ ‘1 నేనొక్కడినే' సినిమా సమయంలో లైవ్ షోలలో సుకుమార్ మాట్లాడుతూ కాస్త అసహనానికి గురయ్యారు. తన సినిమాలు అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేని వారు నా సినిమాలు చూడొద్దనే విధంగా వాదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘నాన్నకు ప్రేమతో' సినిమా బాగానే ఆడుతూ, మంచి వసూళ్లు సాధిస్తున్నప్పటికీ కొందరికి ఈ సినిమా అర్థం కాలేదనే వాదన కూడా ఉంది. ఈ క్రమంలోనే జీవి ఇంటర్వ్యూలో సుకుమార్ ఈ మాట అన్నట్లు తెలుస్తోంది.
త్వరలో మహేష్ బాబుతో హిట్ సినినిమా చేస్తానని సుకుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ డైరెక్టర్ని ఆ సినిమా హీరోగానీ, నిర్మాతలుగానీ ఎలా చూస్తారో నాకు తెలీదు గానీ, మహేష్ నన్ను ఎంత అభిమానిస్తాడో మాటల్లో చెప్పలేను. అలాగే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలకు కూడా నేనంటే ఎంతో అభిమానం. ‘1 నేనొక్కడినే' సినిమా ఫలితానికి రివెంజ్ తీర్చుకోవాలని వుంది. మహేష్తో ఒక మంచి సూపర్హిట్ మూవీ తియ్యాలన్నది నా గోల్. నా నెక్స్ట్ మూవీ అదే అని నేను చెప్పడం లేదు. మహేష్ నన్ను పూర్తిగా నమ్మాడు. 1 సినిమా కు నేను అతన్ని మోసం చేశాను అనుకుంటున్నాను. అందుకే అతనికి ఒక హిట్ సినిమా చేస్తాను అన్నారు.
ప్రస్తుతం సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే....ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆయన్ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా నిర్మించబోతున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా పని చేయనునప్నారు.