Don't Miss!
- News ఎండలో తిరిగితే జ్వరం..పూలు వేస్తే ఎలర్జీ..నీకు రాజకీయాలెందుకు..?
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
సూపర్ హిట్ దర్శకుడిపై అఖిల్ కన్ను? చేస్తానంటూ స్టేజీపై ప్రకటన
హైదరాబాద్: తొలి చిత్రం అఖిల్ తో డిజాస్టర్ అందుకున్న అఖిల్ తన తదుపరి చిత్రానికి ఏ దర్శకుడు అయితే బాగుంటుందనే విషయమై క్లారిటీకా రాలేకపోతున్నారు. మొన్నామధ్య కృష్ణగాడి వీర ప్రేమ గాధ దర్సకుడు హను రాఘవపూడితో ముందుకు వెళ్తానని ట్విట్టర్ సాక్షిగా ప్రకటించాడు. అయితే అనుకోకుండా సీన్ లోకి నితిన్ వచ్చాడు. హను,నితిన్ కాంబినేషన్ సెట్ అయ్యి మళ్లీ అఖిల్ రెండో చిత్రం దర్శకుడు పోస్ట్ ఖాళీ అయ్యింది.
ఈ నేపధ్యంలో అఖిల్ తన తదుపరి చిత్రం కోసం మనం దర్శకుడు విక్రమ్ కుమార్ తో ముందుకు వెళ్దామా అనుకున్నారు. ఈ మేరకు ఓ కథ కూడా విన్నారని సమాచారం. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆయనలో మళ్లీ డైలమో మొదలైందిట.
తనకు తగ్గ కథ కాదేమో అని, వేరే యంగ్ డైరక్టర్ తో ముందుకు వెళ్తే ఎలా ఉంటుందని, ఆయన ఆలోచిస్తున్నారుట. అందుకోసం ఆయన మరో దర్సకుడుతో మంతనాలు మొదలెట్టారని సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు..
రీసెంట్ గా చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది 'పెళ్లి చూపులు' చిత్ర దర్శకుడు. 'పెళ్లి చూపులు' సినిమా తెగ నచ్చటంతో దర్శకుడు తరణ్ భాస్కర్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అక్కినేని అఖిల్ ప్రకటించారు.
హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన 'పెళ్లి చూపులు' విజయోత్సవ సమావేశానికి అఖిల్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. 'పెళ్లి చూపులు' కథ, కథనాలు తనను ఎంతో ఆకర్షించాయని వివరించారు. చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.