Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆర్థిక ఇబ్బందులు: ‘టెంపర్’ ఆడియో వేదిక మార్పు!
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్న ‘టెంపర్' ఆడియో వేడుక వేదిక మార్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఆడియో వేడుక తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో జరుపాలని నిర్ణయించారు. అయితే దీని వల్ల ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉండటంతో హైదరాబాద్ లోనే ఆడియో ఫంక్షన్ నిర్వహించాలని నిర్మాత బండ్ల గణేష్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఆడియో ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారనేది త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
టెంపర్ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ విడుదలయినప్పటి నుండే ప్రీ రిలీజ్ టాక్ అదిరిపోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా జూ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీ లుక్ సినిమాపై అంచనాలు మరింత పెచేలా చేసాయి. దీనికి తోడు నిర్మాత బండ్ల గణేష్......సినిమాకు తనదైన రీతిలో ప్రచారం కల్పిస్తున్న్నాడు. ‘టెంపర్' మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అని సోషల్ మీడియా ద్వారా ప్రచారం ప్రారంభించారు. బండ్ల గణేష్ కు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాత అనే పేరు ఉంది. అందుకే ఆయన్ను అంతా బ్లాక్ బస్టర్ గణేష్ అని పిలుస్తుంటారు. మరో వైపు ఎన్టీఆర్ అభిమానులు, ప్రేక్షకులకు కూడా సినిమా ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరో వైపు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓ చానల్ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని దక్కించుకుందని తెలుస్తోంది. 7.7 కోట్లకు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని ఆ చానల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టెనర్ ‘టెంపర్'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్ నూతన సంవత్సర కానుకగా ఈ రోజు విడుదలైంది. ‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదపడితే దండయాత్ర...ఇది దయాగాడి దండయాత్ర' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ తో విడుదల చేసిన ఈ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.