Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చివరకు అఖిల్ భవిష్యత్తును ఆ డైరెక్టర్ చేతిలో పెట్టారు!
హైదరాబాద్: స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ ఎంట్రీ చాలా గ్రాండ్ గానే జరిగింది. సినిమా విడుదల వరకు అఖిల్ పై అంచనాలు భారీగా ఉండేవి....అయితే సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో హైప్ కాస్త చల్లబడి పోయింది. తన కొడుకు తొలి చిత్రం భారీ విజయం సాధించాలని నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఘోరం జరిగిపోయింది.
తొలి సినిమా విషయంలో కొన్ని విషయాల్లో అతి పోకడలకు పోవడం వల్లనే అలా జరిగటిందని భావిస్తున్న నాగార్జున.... రెండో సినిమా విషయంలో మాత్రం అలా ఉండకూడదని భావిస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ రెండో సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడిగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లో అఖిల్ 2వ సినిమా ప్రారంభం అవుతుందని టాక్.
ఈ సినిమా కోసం ఆల్రెడీ నాగార్జున వంశీ పైడిపల్లికి అడ్వాన్స్ కూడా ఇచ్చాడని, డైరెక్టర్ ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ మీద ఫోటో షూట్ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. అఖిల్ ను డిఫరెంట్ గా చూపించేందుకు వంశీ పైడిపల్లి సిద్ధమైనట్లు సమాచారం.
ఊపిరి సినిమా షూటింగ్ సమయంలో వంశీ పైడిపల్లి పనితీరుకు ఫిదా అయిన నాగార్జున.... అఖిల్ 2వ సినిమా బాధ్యతలు అతనికే అప్పగించాలని నిర్ణయించుకున్నాడట. అఖిల్ రెండో సినిమా విషయంలో నాగార్జున చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో తానే నిర్మిస్తున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రతి అంశంలో నాగార్జున ఇన్వాల్వ్ ఉండబోతోందని అంటున్నారు. ఇది అఖిల్ భవిష్యత్తును నిర్ణయించే సినిమా కాబోతోంది.