Don't Miss!
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
అఖిల్ కథ మళ్లీ మొదటికే? వంశీ పైడిపల్లి తప్పుకున్నాడా? రీజన్ ఏంటి?
హైదరాబాద్ : నాగార్జున రెండో కుమారుడు అఖిల్ తన తొలి చిత్రం 'అఖిల్' డిజాస్టర్ కావటంతో రెండో చిత్రం విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలని, ఏదీ ఇప్పటివరకూ మొదలుపెట్టలేదు. అప్పటికీ నాగార్జున తనే ఈ సారి అన్ని దగ్గరుండి చూసుకుందామని తనతో ఊపిరి వంటి హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి కు ఆ భాధ్యత అప్పచెప్పాడు.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి ...నో చెప్పి ప్రక్కకు తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నాగార్జున ..బాలీవుడ్ చిత్రం యే జవాని హై దీవాని ని అఖిల్ తో రీమేక్ చేయాలని, వంశీ పైడిపల్లిని ఆ పనిలో ఉండమని చెప్పారట. అయితే వంశీ పైడిపల్లి మొదటి ఓకే అన్నా తర్వాత... వరసగా రీమేక్ లు చేస్తే ...తనపై రీమేక్ లు మాత్రమే డీల్ చేయగలడనే ముద్ర పడుతుందని భావించి వద్దనుకున్నాడట.
దాంతో తను సొంతంగా ఓ కథ తయారు చేసుకుని అఖిల్ తో ముందుకు వెళ్దామనే ఆలోచనలో ఉన్నారట. కానీ నాగార్జున మాత్రం బాలీవుడ్ రీమేక్ నే చేసి హిట్ కొట్టాలనే ఉన్నారట. ఈ నేపధ్యంలో వంశీ పైడిపల్లి ఆ క్యాంప్ నుంచి బయిటకు వచ్చి ఎన్టీఆర్ తో కానీ రామ్ చరణ్ తో కానీ ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. గతంలో ఈ ఇద్దరు హీరోలతో బృందావనం, ఎవడు హిట్ కొట్టి ఉన్నాడు. మరి నాగార్డున ఏమంటారో చూడాలి.