Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఒకే రీమేక్ పై మెగా హీరోలిద్దరి కన్ను
హైదరాబాద్ : ఇప్పుడు హాట్ టాపిక్ అంతా రామ్ చరణ్ కి పోటీగా వరున్ తేజ్ ఇస్తున్న పోటీ గురించే . గతంలో చిరంజీవి సుపర్ హిట్ సినిమా చాలెంజ్ మీదే వీరిద్దరి కళ్లూ పడ్డాయి. ఇప్పుడు ఎవరికి వాళ్లే ఈ సినిమాని రీమేక్ చేయాలనకుంటున్నట్లు సమచారాం. మరి ఎవరికి ఆ అదృష్టం వరిస్తుందో చూడాలి మరి..కాకపోతే ఇద్దరు మెగా ఫ్యామిలికి చెందిన వాళ్లే కావడంతో టాపిక్ గ మారింది.
రామ్ చరణ్ ఇప్పుడు తని ఒరువన్ రీమేక్ పనుల్లో బిజీగ ఉంటే...వరుణ్ తేజ తన తాజా చిత్రం లోఫర్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. 'ముకుంద', 'కంచె' వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్ నాగబాబు తనయుడు సుప్రీమ్ హీరో వరుణ్ తేజ్.
వరుణ్ తేజ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ సి.కళ్యాణ్ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్, తేజ నిర్మిస్తున్న భారీ చిత్రం 'లోఫర్'. సునీల్ కశ్యప్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే..
ఈసినిమా ఖచ్చితంగా విజయం సాదిస్తుందని దీమాగా ఉన్నాడు వరున్. పూరితో ఈ సినిమా కొత్త ఉత్సహం అందిచిందని ఆనందంలో గడుపుతున్నాడు.