Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'ఆరడుగుల బుల్లెట్టు' టైటిల్ ఆ మెగా హీరోకే ఫైనల్
పవన్కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రంలోని పాటలోని 'ఆరడుగుల బుల్లెట్' టైటిల్ తో ఏ హీరో సినిమా చేస్తాడనేది అందరిలో చాలా సస్పెన్స్ గా ఉంది. అయితే ఈ టైటిల్ తో త్వరలో లాంచ్ అవుతున్న మరో మెగా హీరో వరుణ్ తేజ చిత్రం చేస్తారని సమాచారం. ఈ టైటిల్ పెట్టడంతో పవన్ బ్రాండ్ కూడా యాడ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల డైరక్ట్ చేయనున్నట్లు చెప్తున్నారు.
ఇక 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ అధినేత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ 'ఆరడుగుల బుల్లెట్' టైటిల్గా ఫిల్మ్చాంబర్లో రిజిస్టర్ చేయించారు. మరి వరుణ్ తేజ్ ని అశ్వనీదత్ లాంచ్ చేయనున్నారు. దాంతో 'ఆరడుగుల బుల్లెట్' టైటిల్ ని అశ్వనీదత్ కి తీసుకుంటున్నట్లు చెప్తున్నారు..
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలంతా దాదాపుగా సక్సెస్ అయ్యారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా హీరోగా పరిచయం అవ్వడానికి రెడీ అవుతున్నాడు. వరుణ్ తేజ్ కూడా ఇతర మెగా హీరోల్లానే సక్సెస్ అవుతాడనే పూర్తి నమ్మకంతో ఉన్నారు అభిమానులు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు అతన్ని సక్సెస్ ఫుల్గా లాంచ్ చేసే నిర్మాత, దర్శకుడి కోసం మల్లగుల్లాలు పడ్డ మెగా ఫ్యామిలీ చివరకు పూరి జగన్నాథ్ను దర్శకుడిగా, అశ్వినీదత్ను నిర్మాతగా ఎంపిక చేసారు.
ఫలితంగా 'చిరుత' చిత్రం ద్వారా సక్సెస్ ఫుల్గా లాంచ్ అయ్యాడు రామ్ చరణ్. తాజాగా వరుణ్ తేజకు కూడా ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారు మెగా ఫ్యామిలీ మెంబర్స్. నిర్మాత అశ్వినీదత్ చేతుల మీదుగా హీరోగా లాంచ్ అయితే అతను సక్సెస్ ఫుల్ హీరోగా ఎదుగుతాడనే సెంటిమెంటు ఇండస్ట్రీలో బలంగా పాతుకు పోయింది. గతంలో ఆయన ద్వారా వెండి తెరకు పరిచయమైన మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్లే ఇందుకు నిదర్శనం.