Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రజనీతో అనుకున్న రీమేక్ ..వెంకటేష్ తో చేస్తున్నారు
హైదరాబాద్ : వెంకటేష్ కెరీర్ లో ఎక్కువ హిట్ లు రీమేక్ లతో వచ్చినవే. దాంతో ఆయన రీమేక్ అంటే వెంటనే ఉత్సాహం చూపించి రంగంలోకి దూకేస్తారు. తాజాగా అలాంటి రీమేక్ ఒకటి వెంకటేష్ కు దొరికిందని తెలుస్తోంది. ముందుగా రజనీకాంత్ తో అనుకున్న రీమేక్ ని ... ఇప్పుడు వెంకటేష్ తో ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
రీసెంగ్ గా ఆయన ముమ్మట్టి, నయనతార కాంబినేషన్ లో రూపొందిన భాస్కర్ ది రాస్కెల్ చిత్రం చూడటం జరిగిందని, దాంతో ఆ చిత్రం రీమేక్ చేస్తే బాగుంటుందని ఆసక్తి చూపుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెప్తున్నారు.
మమ్ముట్టి - నయనతార జంటగా నటించిన ‘భాస్కర్ ది రాస్కెల్' అనే సినిమా ఈ ఏడాది ఏప్రిల్ లో మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. భాస్కర్ ది రాస్కెల్ రీమేక్ రైట్స్ ని సురేష్ బాబు సొంతం చేసుకున్నాడు. సురేష్ బాబు ఈ సినిమాని వెంకటేష్ - నయనతారలతో తీయాలని ప్లాన్ చేస్తున్నాడు.
ప్రస్తుతం తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారు, ఇంకా ఎవరెవరు ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతారు అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
మళయాళంలో సిద్దికి(బాడీగార్డ్ డైరక్టర్) డైరక్ట్ చేసిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో వెంకటేష్ కి ప్రత్యేక స్క్రీనింగ్ వేసి చూపించారు. అయితే ఇందులో వివాహితుడుగా, ఓ బిడ్డకు తండ్రిగా వెంకటేష్ కనిపించాల్సి ఉంటుంది. అది అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనే విషయమై తర్జనభర్జనలు పడుతున్నారని చెప్పుకుంటున్నారు. వెంకటేష్ మాత్రం తన వయస్సుకు మ్యాచ్ అయ్యే సబ్జెక్టు అని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
భాస్కర్ ..ది రాస్కెల్ కథాంశం విషయానికి వస్తే...
భాస్కర్ (ముమ్మట్టి) పెద్దగా చదువుకోడు, చాలా ర్యాష్ గా ఉంటూంటాడు. కానీ మనస్సు మాత్రం చాలా మంచింది. తన తండ్రి పోగొట్టుకున్న ఆస్తులను తిరిగి సంపాదించిన భాస్కర్ పెళ్లైన కొద్ది కాలంలోనే తన భార్యని పోగొట్టుకుంటాడు. తన కొడుకుతో ...ఓ పెద్ద బంగ్లాలో ఉంటూంటాడు భాస్కర్. తన తండ్రి ర్యాష్ గా ఉండి అందరితో తగువులు పడటం ఆ పిల్లాడికి ఇష్టం ఉండదు.
ఇక నయనతార విషయానికి వస్తే ఆమె చాక్లెట్స్ లు తయారు చేసే వ్యాపారం చేస్తూంటుంది. ఆమె కుమార్తె కూడా...భాస్కర్ కొడుకు చదువుతున్న స్కూల్ లోనే చదువుతూంటుంది. ఆమె కూడా ఒంటిరిగా ఉంటూంటుంది. ఇది గమనించిన పిల్లలు వారిని ఒకటిగా చేసి తన తల్లి, తండ్రులుగా మార్చుకోవాలనుకుంటారు. అయితే దీనికి నయనతార ఒప్పుకోదు. ఈ ప్రాసెస్ లో జరిగిన కామెడీనే కథాంశం.