Don't Miss!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ట్రైలర్ వదలటం వెనుక నాగ్ స్ట్రాటజీ
హైదరాబాద్ : నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తూ...వినోదం, కుటుంబ అనుబంధాల సమాహారంగా తెరకెక్కుతున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా' . ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదలై నాగార్జున అభిమానులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే హఠాత్తుగా ఎందుకు ట్రైలర్ వదిలారనేది ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం... ఈ ట్రైలర్ ని ఓ బిజినెస్ స్ట్రాటజీగా వదిలారని తెలుస్తోంది. అందుకే ట్రైలర్ ని ప్రత్యేకంగా డిజైన్ చేసారని అంటున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం రీషూట్ జరుపుకుంటోందంటూ వార్తలు వచ్చాయి. ఆ ఇంపాక్ట్ చిత్రం బిజినెస్ మీద పడకుండా ఇలా జాగ్రత్తగా నాగార్జున ప్లాన్ చేసాడని చెప్పుకుంటున్నారు.
నాగార్జునకు ఈ సినిమాకు సంబంధించి క్రేజీగా బిజినెస్ కాల్స్ రాకపోవటమే అసలు కారణం అంటున్నారు. దాంతో ట్రేడ్ వర్గాలకు పాజిటివ్ బజ్ ఇవ్వడానికే కొత్త టైలర్ వదిలారని తెలుస్తోంది. ట్రైలర్ బాగుండటంచతో సోగ్గాడే కోసం కొన్ని ఏరియాల వారు ఉత్సాహంగా వస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఆ ట్రైలర్ మరొక్క సారి ఇక్కడ చూడండి.
రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి హీరోయిన్స్. వినూత్న కథాంశంతో గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయంలో కనిపిస్తున్నరు. రెండు పాత్రలు సరికొత్త పంథాలో సాగుతాయని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఇక మనం చిత్రంతో కథల ఎంపికలో తన పంథాను నాగార్జున మార్చుకున్న సంగతి తెలిసిందే. వైవిధ్యంతో కూడిన కథాంశాలకే ప్రాధాన్యతనివ్వాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా.. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా కల్యాణ్కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత. ‘హలో బ్రదర్' తరహాలో వినోదాత్మక సినిమా అని సమాచారం.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం స్వామిజీగా వినోదం పండిస్తారని సమాచారం. హంసానందిని, అనసూయ , చలపతిరావు, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రామ్మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్, సంగీతం: అనూప్ రూబెన్స్.