Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
500 కోట్ల బడ్జుట్ మూవీ 'అమెజాన్ యోధులు' తెలుగులో...
హైదరాబాద్: ప్రముఖ హాలీవుడ్ నటులు రిచాజెన్, సెసిలియా చియాంగ్ జంటగా ఇండో ఓవర్సీస్ బ్యానర్పై ఫ్రాంకీఛాన్ దర్శకత్వంలో 500 కోట్ల భారీ బడ్జెట్లో, హై టెక్నికల్ వాల్యూస్తో హాలీవుడ్లో జాకీచాన్ నిర్మించిన చిత్రం 'ది లెజండరీ అమెజాన్స్'.
ఈ చిత్రం హాలీవుడ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని సాయి శ్రీజ విఘ్నేష్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై జి.వంశీకృష్ణ వర్మ 'అమెజాన్ యోధులు' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. 'మాహిష్మతి రాజ్యం' ఉపశీర్షిక. దీపావళి కానుకగా అక్టోబర్ 29న ఈ చిత్రం రిలీజవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత జి.వంశీకృష్ణ వర్మ మాట్లాడుతూ - ''ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీచాన్ 500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. హాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి సరికొత్త రికార్డ్లు నెలకొల్పింది. తెలుగు ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఈ చిత్రం వుంటుంది. 'బాహుబలి' చిత్రం తరహాలో ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాలు భారీగా వుంటాయి. యాక్షన్ సీన్స్ అన్నీ చాలా థ్రిల్లింగ్గా వుంటాయి.
ఇంతకుముందెన్నడూ చూడని విధంగా సన్నివేశాలుంటాయి. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎంతో కాన్ఫిడెంట్గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ - ''బాహుబలి'లాంటి చిత్రమిది. ప్రేక్షకులకు నచ్చేవిధంగా యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు చాలా ధ్రిల్లింగ్గా ఉంటాయి. ప్రతి విజువల్ చాలా గ్రాండియర్గా ఉంటుంది. దీపావళి పండగకి ఇంతటి భారీ బడ్జెట్ చిత్రాన్ని రిలీజ్ చేయడం మాకెంతో ఆనందంగా వుంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం వుంది'' అన్నారు.
ఈ చిత్రానికి సహ నిర్మాత: జి. యుగంధర్రెడ్డి, నిర్మాత: జి.వంశీకృష్ణ వర్మ, దర్శకత్వం: ఫ్రాంకీ ఛాన్.