Don't Miss!
- News రామేశ్వరం కేఫ్ కేసులో ట్విస్ట్, క్లాస్ మేట్ కోసం ఏం చేశాడంటే?, బాంబర్ తో అన్ని నెలలు!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
కమ్యూనిస్టుల దురాగతాలపై సినిమా
న్యూయార్క్ :హాలీవుడ్ స్టార్ హీరోయిన్ .. ఏంజెలీనా జోలీ డైరక్టర్ గా ఇప్పుడో సంచలనాత్మక చిత్రానికి తెర తీస్తోంది. కంబోడియా కమ్యూనిస్టుల దురాగతాల పై ఈ చిత్రం రూపొందనుంది. ఆ చిత్రం పేరు..'ఫస్ట్ దే కిల్డ్ మై ఫాదర్: ఏ డాటర్ ఆఫ్ కంబోడియా రిమెంబర్స్' . ప్రస్తుతం ఆమె ఈ చిత్రాన్ని తెరకెక్కించే సన్నాహాల్లో పూర్తిగా మునిగి ఉంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
చిత్రం నేపధ్యం వివరాల్లోకి వెళితే....1970లో 17లక్షల మందికిపైగా ప్రజలను బలి తీసుకున్న కంబోడియా కమ్యూనిస్టుల దురాగతాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది.
2002లో కంబోడియాకు చెందిన మాడక్స్ అనే అనాథ బాలుణ్ని దత్తత తీసుకుంది జోలీ. ఆ తర్వాత ఏడాది 'మాడక్స్ జోలీ పిట్(ఎమ్జేపీ)' ఫౌండేషన్ను ప్రారంభించింది. కంబోడియాలో పేదరికం కారణంగా ఎదురవుతున్న సమస్యలను రూపుమాపేందుకు ఈ సంస్థ కృషిచేస్తోంది. తన అనంతరం ఫౌండేషన్కు మాడక్స్ సారథ్యం వహిస్తాడని జోలీ చెప్పింది.
జోలి మాట్లాడుతూ.... ''మాడక్స్కు ఇప్పుడు 14 ఏళ్లు. అతడు నా కొడుకు మాత్రమే కాదు కంబోడియా పుత్రుడు కూడా. ఇప్పుడిప్పుడే తన మాతృదేశం గురించి తెలుసుకుంటున్నాడు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను తనే నడిపిస్తాడ''ని చెప్పింది జోలీ.