కిట్టు ఉన్నాడు జాగ్రత్త (2017)(U/A)
కిట్టు ఉన్నాడు జాగ్రత్త స్టోరి
కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ్ తరుణ్, అను ఇమ్మాన్యుయెల్, అర్బాజ్ ఖాన్, పృద్వి, నాగ బాబు, రఘు బాబు, తాగుబోతు రమేష్, ప్రవీణ్, ఫిస్ వెంకట్, పోసాని కృష్ణ మురళి, ప్రిద్వీ, రాజ రవింద్ర, సుధర్శన్, తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ కృష్ణ నిర్వహించారు మరియు నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రుబెన్స్ స్వరాలు సమకుర్చురు.
కథ
అనాధ అయిన కిట్టు(రాజ్తరుణ్) మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన తన స్నేహితులతో కలసి ఓ గ్యారేజీ నడుపుతుంటాడు. ఆడుతూ, పాడుతూ హ్యాపీగా బ్రతికేస్తున్న అతని జీవితంలోకి జానకి(అను ఇమ్మాన్యుయేల్) ప్రవేశించటంతో , ఆమె ప్రేమలో పడటంతో అతని లైఫ్ టర్న్ అవుతూుంది. ఓ రోజు జానికి యాక్సిడెంటల్ గా అతని గ్యారేజ్ లో ఓ పాతిక లక్షలు రూపాయల బ్యాగ్ పెట్టి మరిచిపోతుంది. మరుసటి రోజు ఆ బ్యాగ్ పట్టుకెళ్దామనుకునేలోగా ...కిట్టు ఫ్రెండ్స్ లో ఒకరు ..దాన్ని పట్టుకుని పారిపోతాడు. దాంతో తన ప్రేమ పై మచ్చపడకుండా ఉండటానికి కిట్టు తాము దాచుకున్న డబ్బుకు, ఓ పదిహేను లక్షలు, ఎక్కువవడ్డీ రేటుకు అప్పు చేసి ఇచ్చేస్తాడు. అయితే తాము గ్యారేజ్ లో పనిచేస్తూ..చేస్తూ అంత పెద్ద మొత్తం తీర్చలేమని కిట్టు తన ఫ్రెండ్స్ తో కలిసి కుక్కుల కిడ్నాపర్ అవతారం ఎత్తి ఆ డబ్బుని అప్పు తీరుస్తూంటారు. ఈ విషయం జానకికి తెలిసిపోయి నిలదీస్తుంది. కిట్టు నిజం చెప్పలేకపోతాడు. దాంతో కిట్టూ, జానకి విడిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు ఏఆర్(అర్ఫాజ్ఖాన్) సెలబ్రెటీలను బ్లాక్మెయిల్ చేస్తూ వారి ద్వారా తన అవసరాలను తీర్చుకుంటుంటాడు. ఈ నేపథ్యంలో ఐటీశాఖ ఏఆర్ ఇంటిపై దాడి చేస్తుంది. బ్లాక్మెయిల్ చేయాలనుకున్న సెలబ్రెటీల జాబితా ఉన్న లాకర్ను ఐటీ ఆఫీసర్(నాగేంద్రబాబు) సీజ్ చేసి తీసుకెళ్లిపోతాడు. దీంతో ఐటీ ఆఫీసర్ కుమార్తె అయిన జానకిని ఏఆర్ కిడ్నాప్ చేయిస్తాడు. అదే సమయంలో కిట్టు సైతం తెలియక ..తన లవర్ జానికి కుక్కను కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసేలోగా జానికి కిడ్నాప్ ... నేరం కిట్టుపై పడుతుంది. దాని నుంచి కిట్టు ఎలా బయటపడ్డాడు? జానకిని ఏ విధంగా బయటకు తీసుకొచ్చాడు. తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.