క్షణం (2016)(U/A)
క్షణం స్టోరి
క్షణం సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అడివి శేషు, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ, వెన్నేల కిశోర్, సత్యం రాజేష్, రవి వర్మ, సత్య దేవ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవికాంత్ పెరుపు నిర్వహించారు మరియు నిర్మాత ప్రసాద్ వి పోట్లూరు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకుర్చరు.
కథ
ఎన్నారై రిషి(అడవి శేష్)కి ఓ రోజు ఇండియా నుంచి ఓ ఫోన్ వస్తుంది. అయితే ఆ పోన్ రెగ్యుల్ గా తనతో టట్ లో ఉండేవారు అయితే పెద్దగా చెప్పుకునేదేమీలేదు. అయితే నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమించుకుని, అది వివాహం దాకా సాగక విడిపోయిన తన మాజీ లవర్ అయిన శ్వేత(ఆద శర్మ) నుంచి ఆ ఫోన్ కాల్. సర్లే క్యాజువల్ గా ఎలా ఉన్నావ్..అనే కాల్ అయితే అసలు పట్టింకోనక్కర్లేదు. అయితే ఆమె మన హీరో రిషిని ఓ సాయిం అడుగుతుంది..అది మరేదో కాదు..తన కూతురు రియా రెండు నెలల నుంచి కనిపించడం లేదని, ఎవరు కిడ్నాప్ చేసారో తెలియడం లేదని, తన కూతురుని వెతికి పెట్టమని సాయం కోరుతుంది. దాంతో కోసం ఇండియాకి వస్తాడు.. వచ్చి శ్వేత నుంచి జరిగింది తెలుసుకొని ఆ పాప కోసం సెర్చింగ్ మొదలు పెడతాడు. ఈ క్రమంలో అతనికి రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. ఒక టైమ్ లో అసలు పాపే లేదనే దాకా వెళ్తుంది. ఏం చెయ్యాలి. ఉందని వెతకాలా..లేదని వెనక్కివెళ్లిపోవాలా.. రియా దొరికిందా లేదా? అసలు శ్వేత రిషికే ఎందుకు ఫోన్ చేసింది? ఈ కేసు దర్యాప్తులో ఐపీఎస్ జయ (అనసూయ)కి పాత్ర ఏమిటి? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.