మనమంతా (2016)
మనమంతా స్టోరి
మనమంతా సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించినవారు మోనల్ లాల్, గౌతమి, విశ్వంత్, అనిషా అంబ్రోసె, ఉర్వషి, ఎస్ పి బాలసుబ్రమణ్యం, మారుతి రావు గొల్లపూడి, నరేష్, నీడుమూడి వేణు, పరుచూరి వెంకటేశ్వర రావు, జోయ్ మత్వే, వెన్నేల కిశోర్, నరేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చంద్రశేఖర్ యేలేటి నిర్వహించారు మరియు నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మహేష్ శంకర్ స్వరాలు సమకుర్చరు.
కథ
సాయిరామ్, గాయత్రి, మహిత, అభి అనే నలుగురి కథల సమాహారమే 'మనమంతా' చిత్రం. సాయి రామ్ (మోహన్ లాల్) ఓ పెద్ద రీటైల్ సూపర్ మార్కెట్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తూంటాడు. తన మధ్యతరగతి జీవితాన్ని ముందుకు నడిపించడం కోసం అప్పులు చేయాల్సిన స్థితిలో ఉంటాడు...మేనేజర్ గా ప్రమోషన్ వస్తే తన కష్టాలు తీరిపోతాయని ఆశపడుతుంటాడు.
గాయత్రి (గౌతమి) మధ్య తరగతి ఇల్లాలు..కుటుంబమే జీవితంగా గడిపే గృహిణి. ఏమేం చేస్తే తన భర్త, పిల్లలు సంతోషంగా ఉంటారని ఆలోచిస్తూ ఉండే మనస్థత్వం. అభిరామ్ (విశ్వాంత్) ఇంజనీరింగ్ కుర్రాడు. జీవితంలో మంచి స్థాయికి రావడానికి కష్టపడి చదివే మనస్తత్వం ఉన్న కుర్రాడు. మహిత (రైనా రావు) 12 ఏళ్ల విద్యార్థిని. అందరికీ సహాయం చేసే మనస్తత్వం. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితాల్లో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకున్న తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది మిగతా కథ.