పైసా వసూల్ (2017)(U/A)
పైసా వసూల్ స్టోరి
పైసా వసూల్ సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందమూరి బాలకృష్ణ, శ్రియా సరన్, ముస్కాన్ సేతి, కైరా దత్, అలీ, పవిత్ర లోకేష్, కబీర్ బేడి, విక్రమ్ జిత్ విర్క్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పూరి జగన్నాథ్ వహించారు మరియు నిర్మాత ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రుబెన్స్ అందించారు.
కథ
మాఫియా డాన్ బాబ్ మార్లీ(విక్రమ్ జీత్) ఆగడాలతో ఇండియా వణికిపోతూ ఉంటుంది. పోర్చుగల్లో ఉంటూ ఇండియాలో మాఫియా సామ్రాజ్యం నడిపిస్తున్న బాబ్ మార్లీకి ఓ సెంట్రల్ మినిస్టర్ సపోర్టు కూడా ఉంటుంది. బాబ్ మార్లీ ఆట కట్టించడం పోలీసుల వల్ల కాక పోవడంతో...... ఆ క్రిమినల్ను అంతం చేసేందుకు తీహార్ జైలు నుండి వచ్చిన తేడా సింగ్(బాలకృష్ణ)కు ఆ బాధ్యత అప్పగిస్తారు. అయితే తేడా సింగ్ వ్యవహారం తేడాగా ఉండటంతో నిఘా పెట్టిన పోలీసులు.... అతడు పోర్చుగల్ నుండి వచ్చిన బాల అని గుర్తిస్తారు. బాలకు, బాబ్ మార్లీకి సంబంధం ఏమిటి? తేడా సింగ్గా అతడు ఎందుకు నాటకం ఆడాల్సి వచ్చింది..... ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు శ్రీయ, ముస్కాన్ సేథిలతో లింక్ ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే