ఉంగరాల రాంబాబు (2017)(U/A)
ఉంగరాల రాంబాబు స్టోరి
కథ
రాంబాబు (సునీల్) 200 కోట్ల ఆస్తికి వారసుడు. వ్యాపారాల్లో నష్టం రావడంతో అప్పులపాలై ఆస్తి మొత్తం పోగొట్టుకుంటాడు. బాదాం బాబా(పోసాని) చూపిన దారిలో నడిచి రూ. 200 కోట్లు విలువైన బంగారం దొరకడంతో పోగొట్టుకున్న తన ఆస్తులన్నీ చేజిక్కించుకుని..... 200 బస్సులు కొని ట్రావెల్ సంస్థను మొదలు పెడతాడు. బాదాం బాబా సూచన మేరకు తనకు బాగా కలిసొచ్చే జాతకం ఉన్న సావిత్రి (మియా జార్జ్)ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో రాంబాబు, సావిత్రి ప్రేమలో పడతారు. అయితే పెళ్లి జరుగాలంటే తన తండ్రి రంగ నాయర్(ప్రకాష్ రాజ్) అనుమతి తప్పనిసరి అంటుంది సావిత్రి. రంగ నాయర్ కేరళలో చెగునె పూగొండి వనం అనే గ్రామపెద్ద. కరడుగట్టిన కమ్యూనిస్ట్ లీడర్. క్యాప్టలిస్టు బుద్దులున్న రాంబాబు అంటే రంగనాయక్ కు అస్సలు నచ్చదు. మరి సావిత్రిని దక్కించుకోవడానికి వాళ్ల రంగనాయర్ పెట్టిన పరీక్షలు ఎలా పాసయ్యాడు? అనేది తెరపై చూడాల్సింది.