Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ముగ్గురు మూర్ఖులకీ సీక్వెల్ వస్తోంది: ఇంకోసారి "ఆల్ ఈజ్ వెల్" మంత్రం తో అమీర్ ఖాన్
భిన్న చిత్రాల దర్శక, నిర్మాతగా రాజ్కుమార్ హిరానీకి బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. ఆయన రూపొందించిన '3 ఇడియట్స్' చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో అమీర్ఖాన్, మాధవన్, శర్మన్ జోషీ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఈ సినిమా కేవలం బాలీవుడ్కే పరిమితం కాకుండా పలు భారతీయ భాషల్లోనూ రీమేకై మంచి విజయాన్ని సాధించింది.
అమీర్ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాకి రాజ్కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు. రాజ్కుమార్ దేశంలోనే గొప్ప డైరెక్టర్గా పేరు పొందాడు. రాజ్కుమార్ సామాజిక సమస్యలను తన సినిమాలలో హైలెట్ చేస్తూ ఉంటాడు. సామాజిక సమస్యలను ప్రస్థావిస్తూనే సినిమాను ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కిస్తాడు. ఈ విధంగా కొంతమంది దక్శకులు మాత్రమే చెయ్యగలరు. 'బాహుబలి' సినిమా చిత్రీకరించిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా రాజ్కుమార్ కి అభిమాని.
2009లో విడుదలైన "3 ఇడియట్స్" ఏకంగా 300 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి. అమీర్ ఖాన్ కెరీర్ లోనే కాకుండా బాలీవుడ్ సినిమా చరిత్రలోనే సరికొత్త సంచలనాలను సృష్టించింది. అటు వినోదాన్ని పంచుతూనే ఇప్పటి విధ్యావిధానం మీద అత్యద్బుతంగా వేసిన సెటైర్ ఈ సినిమా. ప్రస్తుతం ఉన్న విధ్యా విధానం లో ఉన్న లోపలను, పిల్ల మీద మోపుతున్న కెరీర్ భారాన్ని సున్నితంగా ఎత్తి చూపిన సినిమాఇది.
ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించేందుకు రాజ్కుమార్ హిరానీ రంగం సిద్ధం చేశారు.అమీర్ ఖాన్, మాధవన్, శర్మాణ్ జోషి, కరీనా కపూర్ లు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం సీక్వెల్ ను కూడా వారితోనే తెరకెక్కీంచేందుకు రాజ్ కుమార్ సన్నాహాలు చేసుకొంటున్నాడు.
ఇప్పటికే ఈ సీక్వెల్ కోసం కొన్ని స్టోరీ లైన్లు ప్రిపేర్ చేసుకొన్న రాజ్ కుమార్.. సదరు స్టోరీ లైన్లను సినిమాటిక్ గా తీర్చిదిద్దమని తన అసిస్టెంట్లకు చెప్పాడట.ఇప్పుదు వారంతా రాబోయే ముగ్గురు ఈడియట్లనీ తీర్చిదిద్దే పనిలో పడ్దారట. ఈ విశయన్ని అమీర్ ఖాన్ కూదా అధికారికంగా దృవీకరించాడు.
పదేళ్ళ క్రితం రాకేశ్ ఓం ప్రకాష్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం "రంగ్ దే బసంతి" . ఈ చిత్రం పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ముంబైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలలో తన నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడిన అమీర్, రాజ్ కుమార్ 3 ఇడియట్స్ సీక్వెల్ గురించి చెప్పగా తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అమీర్ అన్నాడు.
ప్రస్తుతం అమీర్ "దంగల్" అనే మల్ల యోదుని జీవితకథ ప్రధానం గా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా రాజు కుమార్ హిరానీ సంజయ్ దత్ జీవిత కథాంశంగా రణబీర్ కపూర్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తవగానే "3 ఇడియట్స్" సీక్వెల్ ఉంటుందట. మరి ఈ సీక్వెల్ లో ఏం చెప్పనున్నారో చూడాలి.
బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ సిద్దమౌతోంది. రణ్ చోడ్ దాస్,ఫరాన్, రాజూ అనే ముగ్గురు ఐఐటియన్లను ప్రధాన పాత్రలు గా చేసుకొని రాజ్ కుమార్ హిరాణీ తీసిన 3 ఈడియెట్స్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. అమీర్ కెరీర్ లోనే ఒక మైలు రాయిగా నిలిచిన ఈ సినిమాకి సీక్వెల్ రానుంది. ఈ సినిమా పనులు కూడా మొదలై పోయాయి.
ఒక సంచలం :
2009లో విడుదలైన "3 ఇడియట్స్" ఏకంగా 300 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి. అమీర్ ఖాన్ కెరీర్ లోనే కాకుండా బాలీవుడ్ సినిమా చరిత్రలోనే సరికొత్త సంచలనాలను సృష్టించింది.
మూస విధ్యా విధానం పై సెటర్:
అటు వినోదాన్ని పంచుతూనే ఇప్పటి విధ్యావిధానం మీద అత్యద్బుతంగా వేసిన సెటైర్ ఈ సినిమా.
తన నవల కి కాపీ అన్నాడు:
అమీర్ ఖాన్, మాధవన్, శర్మాణ్ జోషి, కరీనా కపూర్ లు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం తన నవలకి కాపీ అని ప్రముఖ రచయిత చేతన్ భగత్ కేసు వేశాడు.
అమీర్ కి ఇష్టమైన సినిమా:
తన కెరీర్ లోనే అత్యంత ఇష్టమైన సినిమా అని అమీర్ ఖాన్ చాలా సార్లు చెప్పాడు.
ఇరానీ కీ ఒక మలుపు:
బాలీవుడ్ "మామూ" బౌమన్ ఇరానీ చేసిన ఫ్రొఫెసర్ వీరూ సహస్ర బుద్ది. అప్పటి చాలా మంది ఫ్రొఫెసర్లను భుజాలు తడుముకునేలా చేసింది.
మరవలేని లిప్లాక్:
ఇక క్లైమ్యాక్స్ లో వచ్చే కరీనా లిప్లాక్ అప్పట్లో కింగ్ ఆఫ్ కిసెస్ గా నిలిచింది.
ముగ్గురూ ముగ్గురే:
అమీర్ ఖాన్ కి స్నేహితులుగా ఫరాన్ ఖురేషీ,రాజూ రస్తోగీ లిగా నటించిన మాధవన్, షామాన్ జోషీలు అద్బుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
పాత్రలో ఇమిడిపోయాడు:
40 ల్లో ఉన్న అమీర్ ఖాన్ ఈ సినిమాలో ఇరవైల్లో ఉండే ఒక ఐఐటీ శ్తూడెంట్ గా సరిగ్గా సరిపోయాడు.
సిద్దార్త్ చేయాల్సింది:
మొదట షామాన్ జోషీ చేసిన రాజు రస్తోగీ పాత్రకి సిద్దార్త్ ని అడిగాదట అమీర్. అయితే తనకు మాధవన్ పాత్ర కావలని అడిగి ఆ చాన్స్ పోగొట్టుకున్నాడు సిద్దూ..
మళ్ళీ ఒక సారి
ఇప్పుడు ఇంకోసారి ఈ ముగ్గురు మూర్ఖులూ కలిసి సందడి చేయబోతున్నారు. ఈ సినిమాకి సీక్వెల్ చేసే ప్రయత్నం లోనే ఉన్నాడట. డైరెక్టర్ రాజ్కుమార్ హిరాని.
కరీనా స్తానం ఎవరిదో:
అయితే ఇంకా హీరోయిన్ ఎవరన్నది తెలియ రాలేదు. కరీనా చేసే అవకాశాలు తక్కువేనట.
ఈసారి ఎలా?:
మరి ఈసారి అమీర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో ఇంకా క్లారిటీ లేదు. అదే కథని పొడిగిస్తారా లేదంటే అలంటిదే మరో సబ్జెక్ట్ ని ఎంచుకుంటారా అన్నదే తెలియాల్సి ఉంది.
అదే ముగ్గురు:
అంతే కాదు మళ్ళీ ప్రధాన పాత్రల్లో అదే ముగ్గురూ (అమీర్,మాధవన్, జోషీ) ఉంటారట.