Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఏఆర్ రెహమాన్కు మరో అవార్డు పురస్కారం...
హైదరాబాద్: ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ ను మరో అవార్డు వరించింది. ప్రతి ఏడాది ‘పద్మశ్రీ పండిత్ హృదయనాధ్ మంగేష్కర్' పేరిట బహూకరించే అవార్డుకు ఈ సారి ఏఆర్ రెహహాన్ అందుకోబోతున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాత సుభాష్ ఘాయ్ ప్రతి ఏడాది హృదయనాథ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా రంగంలోని ప్రముఖులకు గత నాలుగేళ్లుగా అవార్డు బహూకరిస్తూ వస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ అవార్డులు లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, అమితాబ్ బచ్చన్, సులోచన థాయిలకు దక్కాయి. ఈ సారి ఈ అవార్డుకు ఏఆర్ రెహమాన్ను ఎంపిక చేసారు. అక్టోబర్ 26న ముంబైలోని దీనానాథ్ మంగేష్కర్ హాలులో ఈ బహుమతి ప్రధానం జరుగుతుంది.
లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, ఉషా, మీనాలకు గారాల సోదరుడైన హృదయనాథ్ ఎక్కువగా మరాఠీ చిత్రాలకు సంగీతం అందించారు. అతడి తొలి సినిమా మరాఠీలో వచ్చిన ‘ఆకాష్ గంగ'. మరాఠీ చిత్ర సీమలో హృదయ నాథ్ ను ముద్దుగా బాలా సాహెబ్ అని పిలిచే వారు.