Don't Miss!
- News ప్రధాని మోడీకి బల్గేరియా అధ్యక్షుడు రుమెన్ స్పెషల్ థ్యాంక్స్: ఎందుకంటే?
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
అమీర్ఖాన్ రెమ్యునరేషన్ విని.. గుండె పట్టుకొన్న బాలీవుడ్ నిర్మాత..
దంగల్ చిత్రం తర్వాత బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ఖాన్ నటిస్తున్న చిత్రం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్. ఈ చిత్రానికి సంబంధించి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న విషయాలు సెన్సేసనల్గా మారుతున్నాయి. తాజాగా థగ్స్
అవును నిజమే.. దంగల్ చిత్రం తర్వాత బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ఖాన్ నటిస్తున్న చిత్రం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్. ఈ చిత్రానికి సంబంధించి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న విషయాలు సెన్సేసనల్గా మారుతున్నాయి. తాజాగా థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ కోసం అమీర్ ఖాన్ డిమాండ్ చేసిన మొత్తంపై బాలీవుడ్లో హీరోలు చెవులు కొరుక్కొంటున్నారట.
లాభాల్లో 70 శాతం
ధూమ్3 చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్ ఆచార్య రూపొందిస్తున్న ఈ సినిమాకు నిర్మాత ఆదిత్యచోప్రా. ఈ సినిమా చర్చల్లో భాగంగా రెమ్యునరేషన్ విషయంపై చర్చ జరుగిందని, ఆ నేపథ్యంలో లాభాల్లో 70 శాతం వాటా కావాలని అమీర్ డిమాండ్ చేశారనేది బాలీవుడ్ వర్గాల్లో లేటెస్ట్ టాపిక్.
2 వేల క్లబ్ వైపు పరుగులు
ఎందుకంటే దంగల్ చిత్రం ఇప్పటికే చైనాలో భారీ వసూళ్లను సాధిస్తూ.. 2 వేల క్లబ్ వైపు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. దేశ, విదేశాల్లో తన క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని ఈ డిమాండ్ చేసినట్టు సమాచారం. ఒకవేళ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ రూ.1000 కోట్ల లాభాన్ని సంపాదిస్తే కేవలం నిర్మాత ఆదిత్యకు మిగిలేది కేవలం రూ.300 కోట్లే.
దంగల్ చిత్రం తర్వాత
దంగల్ చిత్రానికి అమీర్ఖాన్ తీసుకొన్న రెమ్యునరేషన్ మొత్తం రూ.35 కోట్లు. అదనంగా రెవెన్యూలో మరో 33 శాతం మొత్తాన్ని వాటాగా కోరాడు. అంతేకాకుండా శాటిలైట్ హక్కులు మిగితా మరికొన్ని హక్కుల రూపంలో మరో 33 శాతం రాయల్టీ కూడా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొన్నాడు.
అమీర్ఖాన్తోపాటు అమితాబ్
దంగల్ భారీ విజయం తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అమీర్ఖాన్తోపాటు అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫతీమా సనా షేక్ నటిస్తున్నారు. ఈ చిత్రం 2018లో విడుదలకు సిద్ధమవుతున్నది.