Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చైనాలో ‘పికె’ కలెక్షన్ల రికార్డు: బాహుబలి నిర్మాతల్లో ఆశలు!
హైదరాబాద్: అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పికె' చిత్రం ఇండియాలో మంచి విజయం సాధించింది. ఈ చిత్రం చైనీస్ లాంగ్వేజ్ లోకి అనువాదమై గత శుక్రవారం చైనా వ్యాప్తంగా 4,600 థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఇక్కడ మన కరెన్సీ లెక్కల ప్రకారం రూ. 178.34 కోట్లు వసూలు చేసింది. ఒక భారతీయ సినిమా చైనాలో ఈ రేంజిలో వసూళ్లు సాధించడం ఇదే ప్రథమం. గతంలో అమీర్ ఖాన్ ‘3 ఇడియట్స్' సినిమా కూడా చైనాలో మంచి విజయం సాధించింది.
చైనాలో భారతీయ సినిమాలకు మంచి ఆదరణ ఉన్న నేపథ్యాన్ని గమనించిన ‘బాహుబలి' చిత్ర యూనిట్ సినిమాను చైనాలోనూ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా పికె కలెక్షన్లు వారి ‘బాహుబలి' మేకర్స్ లో నూతన ఉత్సాహాన్ని నింపించింది. చైనాతో పాటు ఇంగ్లీష్, ఇతర విదేశీ భాషల్లోనూ ‘బాహుబలి' సినిమా విడుదల కాబోతోంది.
ఇందులో భాగంగా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు పరిచయం చేయడానికి కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని వేదికగా చేసుకొంది. శోభు యార్లగడ్డ, ఛాయాగ్రాహకుడు కె.కె.సెంథిల్కుమార్, ఎస్.ఎస్.కార్తికేయ ఆధ్వర్యంలో ఓ బృందం కేన్స్కు వెళ్లింది. అక్కడ కేన్స్ ప్రతినిధి క్రిస్టియన్ జేన్ను కలిశారు.