Don't Miss!
- News Rahul Gandhi: ఇది నా గ్యారంటీ-సీబీఐ, ఈడీలకు రాహుల్ వార్నింగ్-బీజేపీ సర్కార్ మారగానే..!
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
హీరోపై దాడి చేసిన ఎస్సై, కమీషనర్కు ఫిర్యాదు
బెంగుళూరు: తనపై అనవసరంగా దాడి చేసాడని కన్నడ యాక్టర్ చేతన్ కుమార్ బెంగులూరు సిటీ పోలీస్ కమీషనర్కు ఫిర్యాదు చేసారు. ఈ నెల 24న రాత్రి 1.30 గంటలకు తన స్నేహితులతో కలిసి చర్చ్ స్ట్రీట్ లో ఉండగా కబ్బర్ పార్క్ పోలీస్ సబ్ ఇన్స్ స్పెక్టర్ నవీన్ తనపై దాడి చేసాడంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గురువారం కమీషనర్ ఎంఎన్ రెడ్డిని చేతన్ కుమార్ కలిసారు. ఫిర్యాదు సమయంలో అతనితో పాటు యాక్టర్, ఎంఎల్సి తారా కూడా ఉన్నారు. ఈ కేసు గురించి బెంగులూరు సెంట్రల్ జోన్ డిసీపీ సందీప్ పాటిల్ మాట్లాడుతూ చేతన్ కుమార్ ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. కబ్బన్ పార్క్ ఏసిపి శోభా రాణి ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారని, ఆమె ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు.
చేతన్ కుమార్ పై దాడి చేసినట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న ఎస్సై నవీన్.....కమీషనర్ ఎంఎన్ రెడ్డి పర్సనల్ స్టాఫ్ కుమారుడు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో విచారణ ఎలా ఉంటుందనేది చర్చనీయాంశం అయింది.
చేతన్ కుమార్ గురించిన వివరాల్లోకి వెళితే యూఎస్లో పుట్టి పెరిగిన చేతన్ కుమార్ ఇటీవల ‘ఆ దినగలు' అనే కన్నడ చిత్రం ద్వారా వెండి తెర అరంగ్రేటం చేసారు. తొలి సినిమా తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.