Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాగార్జునకు మళ్లీ తీవ్ర మనస్తాపం... చైతూ కోసం స్వయంగా రంగంలోకి..
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అక్కినేని తన సినిమాలపైనే కాకుండా తన కుమారులు నాగచైతన్య, అఖిల్ అక్కినేని కెరీర్పైనా కేంద్రీకరించారు. ఊపిరి, సోగ్గాడే చిన్నినాయనా, ఓం నమో వెంకటేశాయా లాంటి వరుస హిట్లను
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అక్కినేని తన సినిమాలపైనే కాకుండా తన కుమారులు నాగచైతన్య, అఖిల్ అక్కినేని కెరీర్పైనా కేంద్రీకరించారు. ఊపిరి, సోగ్గాడే చిన్నినాయనా, ఓం నమో వెంకటేశాయా లాంటి వరుస హిట్లను పరిశ్రమకు అందించాడు. విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకొంటూ ప్రేక్షకులను అలరిస్తున్న నాగార్జున ప్రస్తుతం రాజుగారి గది2లో తన ఇమేజ్కు భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. అంతేకాకుండా నాగచైతన్య నటిస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం సినిమాపై దృష్టిపెట్టారు. అయితే ఈ సినిమా అవుట్పుట్పై ఇటీవల నాగార్జున తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఆలస్యంపై ఆగ్రహం..
రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను స్వయంగా అన్నపూర్ణ బ్యానర్పై నాగార్జున నిర్మిస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయన లాంటి సూపర్హిట్ను అందించిన కల్యాణ్ కృష్ణ చేతిలో ఈ ప్రాజెక్ట్ను పెట్టాడు. సినిమా ఆలస్యం కావడంపై అసహనానికి గురయ్యారట. ఈ సినిమా అవుట్పుట్ చూసిన నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారనేది ఫిలింనగర్ సమాచారం.
క్లాసిక్గా మలుచాలనే..
రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాన్ని నిన్నే పెళ్లాడుతా లాంటి క్లాసిక్ సినిమాగా మలుస్తారనే ఉద్దేశంతో కల్యాణ్ కృష్ణకు అప్పగిస్తే ఆ స్థాయిలో లేకపోవడంతో నొచ్చుకున్నారట. అంతేకాకుండా కొన్ని కీలక సన్నివేశాలను రీషూట్ చేయాలని దర్శకుడిని ఆదేశించారనేది తాజా సమాచారం.
ఎడిటింగ్పై స్వయంగా..
నాగచైతన్యకు మంచి క్లాసికల్ హిట్ అందించాలనే లక్ష్యంతో ఈ సినిమాపై నాగ్ స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఎడిటింగ్ డిపార్ట్మెంట్ వద్ద ఈ చిత్రంపై కుస్తీ పడుతున్నారట. ఎడిటింగ్ విభాగం పనితీరును నాగ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తున్నది.
ఆలస్యానికి కారణమిదే..
ఈ సినిమా తాను ఆశించిన మేరకు ప్రాజెక్ట్ను ఓ క్లాసిక్గా రూపొందించాలనే తాపత్రయంతో నాగ్ ఉన్నారనేది ఇంటర్నల్ న్యూస్. నాగ్ సంతృప్తి చెందిన తర్వాతనే రారండోయ్ వేడుక చూద్దాం రిలీజ్కు ముహూర్తం నిర్ణయించే అవకాశం ఉంది. అప్పటివరకు అక్కినేని అభిమానులు వేచిచూడాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.