Don't Miss!
- Sports Ravichandran Ashwin:అతను ధోనీకి లెఫ్టాండ్ వర్షన్!
- News చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ విచారించిన సుప్రీంకోర్టు
- Technology Ai వీడియో కంటెంట్ ను గుర్తించడానికి Youtube కొత్త టూల్! ఎలా పనిచేస్తుంది?
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
జూ ఎన్టీఆర్ ఫ్రెండ్ భూమి కబ్జా చేసారు
హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రాణ స్నేహితుల్లో ఒకరైన రాజీవ్ కనకాల హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. కొందరు అక్రమార్కులు వారి కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
కబ్జాకు గురైన స్థలం రాజవ్ కనకాల తండ్రి దేవదాసు కనకాల పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఈ స్థలంలో గత ఆర్థరాత్రి దుండగులు ప్రవేశించి... అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ విషయాన్ని స్థానికులు వెంటనే దేవదాసు కనకాలకు సమాచారం అందించారు.
అక్కడికి వెళ్లగా కబ్జా దారులు రాజీవ్ కనకాల, దేవదాసు కనకాలతో గొడవకు దిగారు. దీంతో వెంటనే వారు హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన బట్టి హైదరాబాద్ లో కబ్జాదారుల ఆగడాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యులు పరిస్థితి ఏమిటని సమాన్యులు ప్రశ్నిస్తున్నారు.