Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీమంతుడు కాన్సెప్టు: దత్తత బాటలో నటుడు సుమన్!
హైదరాబాద్: గ్రామాలను దత్తత తీసుకోవడం, అభివృద్ధి చేయడం లాంటి కాన్సెప్టు ఎప్పటి నుండో ఉన్నప్పటికీ మహేష్ బాబు ‘శ్రీమంతుడు' తర్వాత ఇది మరింత పాపులర్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటికే మహేష్ బాబు, మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఇలా పలువురు సినీనటులు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ లిస్టులో ప్రముఖ నటుడు సుమన్ కూడా చేరిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగమయేందుకు ప్రముఖ సినీ నటుడు సుమన్ ముందుకుకొచ్చారు. ఈ మేరకు ఆయన మహబూబ్నగర్ జిల్లాలోని మాడ్గుల మండలం సుద్దపల్లి గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు.
గ్రామాలను దత్తత తీసుకునేందుకు ప్రముఖులు ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే టాలీవుడ్ నటులు మహేశ్బాబు, ప్రకాశ్రాజ్ ఇద్దరు మహబూబ్నగర్ జిల్లాలో చెరో గ్రామాన్ని దత్తత తీసుకున్న దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.